Masks for employees
ఉద్యోగులకు మాస్కులు
కొవిడ్-19 ప్రభావంతో ఎన్నికల్లో అదనపు సామగ్రి సరఫరా అయింది. గతంలో ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పెట్టెలు, పత్రాలు, సిరా, వీడియో కెమెరా, ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసేవారు. ప్రస్తుత ఎన్నికల్లో వీటితోపాటు ఉద్యోగులకు కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు మాస్కులు, ఫేసష్ీల్డ్లు, శానిటైజర్లు సరఫరా చేశారు. ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయాలకు ఇవి చేరాయి. పోలింగ్, లెక్కింపు విధుల్లో అధికారులు, సిబ్బందికి ఇవన్నీ ఒకరోజు ముందుగానే అందజేస్తారు. నూజివీడు డివిజన్లో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. 14 మండలాల పరిధిలోని 288 పంచాయతీల్లో సర్పంచులు, 2990 వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు ఏడు వేలమంది ఉద్యోగులు విధుల్లో పాల్గొననున్నారు. ఆ రోజున ఎన్నికల సంఘం సరఫరా చేసే మాస్కులు, ఫేసష్ీల్డులు ధరించి విధులు నిర్వర్తించనున్నారు. శానిటైజర్లు తమతో పాటు ఓటర్లకు వినియోగిస్తారు.
0 Response to "Masks for employees"
Post a Comment