The Central Bank is good news for those who have been vaccinated by Kovid
కొవిడ్ టీకా తీసుకున్న వారికి సెంట్రల్ బ్యాంకు శుభవార్త.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇమ్యూన్ ఇండియా పేరిట ప్రత్యేక డిపాజిట్ పథకం
న్యూఢిల్లీ : మీరు కొవిడ్-19 టీకా వేయించుకున్నారా? అయితే కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంతోపాటు టీకాలు వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు వీలుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. టీకా వేయించుకున్న వారు చేసే బ్యాంకు డిపాజిట్లపై సాధారణం కంటే అధికంగా వడ్డీ ఇచ్చేలా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీంను ప్రారంభించింది. దీనిలో భాగంగా టీకాలు వేయించుకున్న డిపాజిట్ దారులకు 25 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీరేటును బ్యాంకు అందించనుంది.
ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ పథకం కింద 1,111 రోజుల మెచ్చూరిటీతో సీనియర్ సిటిజన్లు చేసిన డిపాజిట్లపై 50 బీపీఎస్ అదనపు వడ్డీకి అర్హులని సెంట్రల్ బ్యాంకు వెల్లడించింది.
కొవిడ్ టీకాలను ప్రోత్సహించేందుకు తాము ఈ ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ బ్యాంక్ ట్వీట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉన్న భారత్ బ్రెజిల్ దేశాన్ని అధిగమించింది. బ్రెజిల్ దేశంలో 13.45 మిలియన్ల కరోనా కేసులు నమోదు కాగా భారతదేశంలో మొత్తం 13.53 మిలియన్లకు పెరిగింది.
0 Response to "The Central Bank is good news for those who have been vaccinated by Kovid"
Post a Comment