Teachers are not front line warriors
ఉపాధ్యాయులు ఫ్రంట్ లైన్ వారియర్స్ కాదు
- వ్యాక్సినేషన్ ఇప్పట్లో కుదరదు
- ప్రభుత్వం స్పష్టీకరణ
- అఫిడవిట్ దాఖలు చేయాలనిహైకోర్టు ఆదేశాలు
రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందించటం సాధ్యపడదని ప్రభుత్వం. తేల్చి చెప్పింది.. కేంద్ర ప్రభుత్వం వారిని ఫ్రంట్ లైన్ వారి యర్లుగా గుర్తించలేదని కోర్టు దృష్టికి తెచ్చింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నామని వారితో కలిసి ఉపాధ్యాయులు కూడా వేయించుకోవాలని సూచించింది. పాఠశాలల పున ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. టెన్త్ పరీక్షలు, పాఠశాలలు పున ప్రారంభం నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నుంచి దాఖలైన పిటిషన్పై హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ కె సురేన్రెడ్డి, జస్టిస్ డి రమేన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదనలువినిపిస్తూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందంటూ పిటిషనర్ చేసిన వాద నలు సరికాదని కోర్టుకు స్పష్టం చేశారు. ప్రత్యేకించి వ్యాక్సి నేషన్ ప్రక్రియ వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.
0 Response to "Teachers are not front line warriors"
Post a Comment