AP SSC, Inter Exams Update
AP SSC, Inter Exams Update: అదే జరిగితే ఒక్కో స్టూడెంట్కు రూ.కోటి ఇవ్వాలి.. ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు హెచ్చరిక..
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు (AP SSC, Intermediate Exams) తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ తరుణంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం సమర్పించిన ఆఫిడవిట్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించడానికే మొగ్గుచూపుతున్నామన్న ప్రభుత్వ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి ఏ విద్యార్థికైనా కరోనా సోకి మరణిస్తే ఒక్కొక్కరి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిచింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలంచిన ధర్మసనం.. జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారుగానీ.. దానిపై పక్కాసమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టమైన సమాచారం ఎక్కడా కనిపించలేదని వ్యాఖ్యానించింది. పరీక్షల నిర్వహణ అంశాన్ని 15 రోజులు ముందుగా చెబుతామన్నారని.. ఏర్పాట్లకు 15 రోజులు ఎలా సరిపోతుందని ప్రశ్నించింది.
పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏవీ ఇవ్వలేనదని.. ప్రభుత్వమే అన్ని రకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలంది. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న సుప్రీం ధర్మాసన... గాలి వెలుతురు ఉండే గదుల్లో పరీల నిర్వహణ వివరాలు లేవని చెప్పింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల సంఖ్య ఆధారంగా చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని.. ఒక్కో గదిలో 15,20 మందిని కూర్చోబెట్టడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ఆ లెక్కన చూస్తే 34వేలకు పైగా గదులు అవసరం అవుతాయని.. ఈ మొత్తంలో ఎలా అందుబాటులోకి తీసుకొస్తారని వ్యాఖ్యానించింది.
0 Response to "AP SSC, Inter Exams Update"
Post a Comment