Formative assessment marks are crucial if the tenth class examinations are not held.
పదవ తరగతి పరీక్షలు జరగకుంటే ఫార్మేటివ్ అసిస్మెంట్ మార్కులే కీలకం..
పరీక్షలు జరగకుంటే ఈ మార్కులనే ప్రామాణికంగా తీసుకుని ఉత్తీర్ణత ప్రకటిస్తారు..
పరీక్షలు జరగకుంటే ఫార్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులతోనే గ్రేడింగ్ ఇచ్చే అవకాశం..
ఈనేపథ్యంలో పాఠశాలల్లో మార్కుల అప్ లోడ్ ప్రక్రియ వేగవంతం..
జూన్ 1 : పది పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి . ఈనెల 7 వ తేదీ నుంచి జరగాల్సిన పది పరీక్షల్ని తాజాగా ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే . పది పరీక్షలు నిర్వహించి తీరుతాం అని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది . ఒక వేళ పది పరీక్షలు నిర్వహించకుంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఉత్తీర్ణత ప్రకటిస్తారు . ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మార్కుల అప్ లోడ్ ప్రక్రియను వేగవంతం చేశారు . రెండు వారాల క్రితం మార్కుల అప్లోడ్ ప్రారంభమైంది . ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తి అయింది మరో 10 శాతం మార్కులు సాంకేతిక కారణాలతో అప్లోడు కాలేదని , రెండు మూడురోజుల్లో నూరుశాతం మార్కులు అప్లోడు చేస్తామని డీఈవో ఆర్ఎస్ -
గంగాభవాని వెల్లడించారు . జిల్లాలో ప్రభుత్వ , జడ్పీ , ఎయిడెడ్ , గురుకుల , నగరపాలక సంస్థ , మున్సిపపాల్టీలు , ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో దాదాపు 1,025 పాఠశాలున్నాయి . ఆయా పాఠశాలల్లో పరీక్షలు రాసే విద్యార్థులు దాదాపు 59 వేల మంది ఉన్నట్లు సమాచారం . విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 , 2 లో వచ్చిన మార్కులు ఈ ఏడాది కీలకం కానున్నాయి . ప్రభుత్వ , ప్రైవేటు ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఎస్ఎ -1 అప్లోడు 92 శాతం , ఎఫ్ -2 89 శాతం పూర్తి అయింది . ప్రభుత్వ , ప్రైవేటు ఆధ్వర్యంలో ఉన్న 1,020 పాఠశాలల్లో 59 వేల మంది విద్యార్థుల మార్కులు అప్లోడు చేస్తారు . సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు , ఇంటర్నల్ మార్కులు కూడా కేటాయిస్తారు . పది విద్యార్థుల మార్కుల ఆలోడు చేసే విషయంలో ప్రభుత్వ , ప్రైవేటు యాజమాన్యాల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది
0 Response to "Formative assessment marks are crucial if the tenth class examinations are not held."
Post a Comment