If you join this scheme, you can get a pension of Rs.3000 per month after 60 years
ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ .3000 పెన్షన్ పొందవచ్చు.
2019 లో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన అసంఘటిత రంగాల వారిని ఉద్దేశించినది. ఈ పెన్షన్ స్కీమ్లో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ పొందవచ్చు.
అర్హత:
అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ నెలకు రూ.15,000 కంటే తక్కువ వేతనం ,18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి ఆదాయ పన్ను వర్తించదు.
ఫీచర్స్:
ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన పథకం స్వచ్ఛంద పెన్షన్ పథకం. 50:50 నిష్పత్తిలో చందాదారుడు ఎంత జమచేస్తే అంతే సమానంగా కేంద్ర ప్రభుత్వం జమచేస్తుంది. ప్రతి చందాదారుడు ఈ పథకం కింద 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ పొందుతాడు.
ఎలా నమోదు చేసుకోవాలి?
అర్హత ఉన్న చందాదారులు వారికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)లకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. ఈ సెంటర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా వద్ద ఉంటుంది. ఈ పెన్షన పథకాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా, జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డ్ అవసరం. దేశవ్యాప్తంగా 3 లక్షల సీఎస్సీ సెంటర్లలో దీనికి నమోదు చేసుకునే సదుపాయం ఉంది.
ఉపసంహరణ నియమాలు:
1. పథకంలో చేరిన తర్వాత పదేళ్ల కంటే ముందే ఇందులోనుంచి నిష్క్రమిస్తే , చందాదారుడు జమచేసిన దానికే మాత్రమే బ్యాంక్ వడ్డీతో కలిపి వస్తుంది.
2. పదేళ్ల తర్వాత, 60 ఏళ్లకు ముందే ఉపసంహరించుకుంటే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ లేదా పొదుపు బ్యాంక్ వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే దానితో పాటు, లబ్ధిదారుడి వాటా తిరిగి లభిస్తుంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
18 ఏళ్ల వయసులో పథకంలో చేరితే నెలకు రూ.55 జమచేయాల్సి ఉంటుంది. అంతే మొత్తంగా ప్రభుత్వం కూడా జమచేస్తుంది. ఇక వయసు పెరిగినా కొద్ది కాంట్రిబ్యూషన్ పెరుగుతూ వస్తుంది. మొదటి నెల చెల్లింపు నగదు రూపంంలో ఇస్తే వారికి రశీదు ఇస్తారు. ప్రత్యేక ఐడీ నంబర్లు కలిగిన కార్డులను కూడా సీఎస్సీలు అందిస్తాయి.
0 Response to "If you join this scheme, you can get a pension of Rs.3000 per month after 60 years"
Post a Comment