Substitutes for tenth talents
పది ప్రతిభకు ప్రత్యామ్నాయాలు
- విద్యా శాఖ పరిశీలనలో రెండు అంశాలు
- ఫార్మేటివ్ పరీక్షలు, మార్కుల నమోదులో ‘ప్రైవేటు’ ఇష్టారాజ్యంపై ఆరోపణలు
సుప్రీంకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మార్కుల కేటాయింపుపై విద్యాశాఖ వద్ద రెండు ప్రతిపాద నలు ఉన్నట్టు తెలిసింది. పది విద్యార్థులకు నిర్వ హించిన ఫార్మేటివ్ అసెస్మెంట్–1, 2 (ఎఫ్ఏ) పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని పబ్లిక్ పరీక్షలకు మార్కులు కేటాయించవచ్చుననేది ఒక ప్రతి పాదన కాగా, వీటితో నిమిత్తం లేకుండా అం దరూ ఉత్తీర్ణులే (ఆల్ పాస్)గా పరిగణిం చవ చ్చుననేది మరో ప్రతిపాదన. ఆ మేరకు ఎఫ్ఏ – 1, 2 పరీక్షల మార్కులను ఇప్పటికే ఆన్లైన్ చేయగా, వాటిని తుది పరీక్షలకు సరాసరిగా తీసుకుని మార్కులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒక్కో సబ్జెక్టుకు 50 మార్కులకు చొప్పున ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహించగా, ఎఫ్ఏ – 1, 2 పరీక్షల మార్కులు మొత్తం 100 మార్కులకు గాను విద్యార్థులు తెచ్చుకున్న మార్కులే పబ్లిక్ పరీక్షలకు కేటాయిస్తారని సమాచారం.
మార్కుల నమోదుపై ఆరోపణలు
ఎఫ్ఏ పరీక్షలు జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలల్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అసలు నిర్వహించలేదని తెలిసింది. ఈ క్రమంలో ఫార్మేటివ్ పరీక్షల ప్రశ్నాపత్రాల బండిళ్లను ఏలూరు కేపీడీటీ హైస్కూల్ స్టోరేజీ పాయింట్ నుంచి పరీక్షల నిర్వహణ నిమిత్తం తీసుకు వెళ్లకుండా వదిలి వేయడంతో ఏలూరు డివిజ న్లో 32 ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖ షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం గమ నార్హం. జిల్లా విద్యాశాఖ నోటీసులకు స్పందించి ప్రశ్నాపత్రాలను తీసుకువెళ్లినా, ఫార్మేటివ్ పరీక్షలు నిజంగా నిర్వహించిదీ, లేనిదీ అనుమానాస్పదమేనని చెబుతున్నా రు. పబ్లిక్ పరీక్షల నిర్వహణ కొవిడ్ ఉధృతి కొనసాగింపు వల్ల డైలమాలో పడడంతో ఎఫ్ఏ–1, 2 పరీక్షల మార్కులను తక్షణమే ఆన్లైన్ చేయాల ని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడంతో పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా మార్కులను గరిష్టంగా నమోదు చేసుకున్నాయని అనుమానిస్తున్నారు. ఆ ప్రకారం ఫార్మేటివ్ పరీక్షల మార్కులనే ప్రామాణికంగా తీసుకుని పబ్లిక్ పరీక్షలకు మార్కులను కేటాయిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకంటే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరికీ టాప్ మార్కులు వచ్చే అవకాశాలు లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవు తోంది. పది పరీక్షలకు మార్కుల కేటాయింపు లేదా గ్రేడ్ల నిర్ధారణ లేదా మరేదైనా ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం నియమించే హైలెవెల్ కమిటీ నివేదికపై అధికారిక నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిందే. జిల్లాలో పది పరీక్షలకు మొత్తం 50 వేల 634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
0 Response to "Substitutes for tenth talents"
Post a Comment