Attack on Head master
సమయానికి రమ్మన్నారని ప్రధానోపాధ్యాయినిపై దాడి
- ఉపాధ్యాయుడు సహా ఏడుగురి అరెస్టు
- దాడి చేయించిన దంపతుల సస్పెన్షన్
దాచేపల్లి,
పాఠశాలకు సమయానికి రావాలని చెప్పినందుకు... ప్రధానోపాధ్యాయినిపై తోటి ఉపాధ్యాయిని దాడి చేయించారు. తన భర్తతో చెప్పి ఆమెను కొట్టించారు. ఈ ఘటనలో ఆమె భర్త సహా ఏడుగురిని గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గురజాల సీఐ ఉమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.... తెలంగాణలోని నల్గొండ జిల్లా వాడపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయిన రాధిక.. తమ పాఠశాలలో ఉపాధ్యాయిని రజని పాఠశాలకు సక్రమంగా రావడం లేదన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. దాంతో రాధికపై రజని కోపం పెంచుకున్నారు. ఆమె భర్త, మల్కా పట్నం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డికి చెప్పి రాధికపై దాడికి పురమాయించారు. ఈ నెల 19న పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కృష్ణప్రసాద్, ప్రధానోపాధ్యాయిని పులగం రాధిక దంపతులు వాహనంపై వస్తుండగా మిర్యాలగూడ ప్రాంతా నికి చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో రామాపురం అడ్డరోడ్డు వద్దకు వచ్చి వారిద్దరిపై దాడి చేశారు. వారి వద్ద ఐదు సవర్ల బంగారం అవహ - రించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన జోగునూరు నరేష్, కోడి నవీన్, బత్తుల శ్రీకాంత్, గొట్టపర్తి వెంకటేష్, వల్లభాయి నవీన్, మొండికత్తి లింగయ్యను అదుపులోకి తీసుకు న్నారు. శ్రీనివాసరెడ్డి సహా ఏడుగురిని అరెస్టుచేసి గురజాల కోర్టుకు
హాజరు పరచినట్లు సీఐ ఉమేష్ పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు రాధికపై దాడి కేసులో ప్రమేయం ఉండటంతో ఉపాధ్యాయ దంపతులు రజని, శ్రీనివాసరెడ్డిలను సస్పెండ్ చేస్తూ నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బి.బిక్షపతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
0 Response to "Attack on Head master"
Post a Comment