Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 Central Government Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త .. es నిబంధనల్లో సడలింపులు .. వివరాలు.

తమ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది, పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్​ (సీఈఏ)ను క్లయిమ్ చేసుకునే నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. ఈ విషయాన్ని డిపార్ట్​మెంట్ ఆఫ్ పర్సనల్​ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ప్రకటించింది. కరోనా లాక్​డౌన్​ వల్ల 2020-21 విద్యా సంవత్సరంలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని క్లయిమ్ నిబంధనలు సవరించింది. ఏడో పే కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పిల్లల విద్య అలవెన్సు (సీఈఏ) కింద ప్రతీనెలా రూ.2250 పొందుతారు. ఇందుకోసం పిల్లల రిజల్ట్స్​/రిపోర్టు కార్డులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే కరోనా లాక్​డౌన్​ల కారణంగా విద్యాసంస్థలు మూతపడడం, పరీక్షలు జరుగగపోవడంతో రిపోర్టు కార్డులు సమర్పించడం ఉద్యోగులకు కష్టంగా మారింది.

విద్యాసంస్థల నుంచి ఎంఎస్​ఎస్​లు, ఈమెయిల్స్ రూపంలోనూ రిపోర్టు కార్డులు అందలేదు.

ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న డీవోపీటీ క్లయిమ్ నిబంధనల్లో మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగులు సెల్ఫె సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుందని వెల్లడించింది. ఒకవేళ ఉంటే రిజల్ట్/రిపోర్టు కార్డు/ ఫీజు పేమెంట్ రశీదుల ఈమెయిల్​, ఎస్​ఎంఎస్​ల ప్రింటౌట్ అదనంగా సమర్పించవచ్చని చెప్పింది. ఈ నిబంధనల సడలింపు మార్చి 2020 నుంచి 2021 మార్చి వరకు అంటే ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

'కరోనా సమయంలో ఎంతో మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సీఈఏ క్లెయిం విషయంలో చాలా ఫిర్యాదులు, సలహాలు వచ్చాయి. కరోనా ప్రభావం కారణంగా రిజల్ట్స్​, రిపోర్ట కార్డులను పాఠశాలలు కనీసం ఎస్​ఎంఎస్​లు, ఈ మెళ్ల రూపంలోనూ పంపడం లేదని, ఫీజు కూడా ఆన్​లైన్​లో డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు. అందుకే సీఈఏ క్లయిమ్ చేసుకునేందుకు కష్టమవుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించాం. సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా కూడా సీఈఏ క్లయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అందుబాటులో ఉంటే రిజల్ట్స్​ ఎస్​ఎంఎస్​/రిపోర్టు కార్డు/ ఫీజు చెల్లించిన రశీదు ప్రింటౌట్​ను అదనంగా సబ్మిట్ చేయవచ్చు. ఈ విధానం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది' అని డీఓపీటీ ప్రకటించింది.

ఇప్పటికే సీఈఏ క్లెయిం సెటిల్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మళ్లీ క్లెయిం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పిల్లల చదువు, హాస్టల్ వసతి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం సీఈఏ ఇస్తోంది. ఏడో పే కమిషన్​ సిఫారసుల ప్రకారం ఉద్యోగికి ప్రతీ నెలా సీఈఏ కింద రూ.2250లు చెల్లించాలి. హాస్టల్ సబ్సిడీని రూ.6750గా రెకమెండ్​ చేసింది. అలాగే డీఏ 50 శాతం పెరిగినప్పుడల్లా.. సీఈఏ, హాస్టల్ సబ్సిడీ 25 శాతం పెంచాలని సిఫారసు చేసింది. మరోవైపు త్వరలోనే ఉద్యోగులకు కేంద్ర కరువు భత్యం (డీఏ) ప్రకటించే అవకాశం ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0