More than one lakh jobs this year
ఐటీ ఫ్రెషర్స్కు లక్కీచాన్స్
- ఈ ఏడాది లక్షకు పైగా ఉద్యోగావకాశాలు
- క్యాంపస్ నియామకాల్లో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో
కరోనా కేసులు క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో భారీ నియామకాలకు సాఫ్ట్వేర్ దిగ్గజాలు శ్రీకారం చుడుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు పెద్దఎత్తున డిజిటలైజేషన్ చేపడుతున్నందున, ఈ సర్వీసులకు ఏర్పడుతున్న డిమాం డ్ కారణంగా ఎన్నడూ లేనంతగా రిక్రూట్మెంట్లు జరగబోతున్నాయి. ఐటీ నిపుణులనే కాకుండా కేవలం కాలేజ్ క్యాంపస్ల నుంచే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్షకుపైగా ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకుంటున్నట్లు దేశంలో టాప్ 3 ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ప్రకటించాయి. కరోనా సంక్షోభంలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మా రిన వేళ ఫ్రెషర్స్కు ఐటీ సంస్థలు అవకాశాలి స్తుండటం ప్రాధా న్యతను సంతరించు కున్నది.
టీసీఎస్ 40,000
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్.. ప్రస్తుత 2021-22లో క్యాంపస్ల నుంచి 40,000 మందికిపైగా ఫ్రెషర్లను తీసుకుంటామని తెలిపింది. 5 లక్షలకుపైగా ఉద్యోగులు కలిగిన ఈ కంపెనీ గతేడాది 40,000 మంది గ్రాడ్యుయేట్లను దేశీయ క్యాంపస్ల నుంచి తీసుకున్నది. ఈ ఏడాది అంతకుమించి రిక్రూట్ చేసుకుంటామని కంపెనీ గ్లోబల్ హ్యుమన్ రిసోర్సెస్ హెడ్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. కొవిడ్ సంబంధిత నియంత్రణలు తమ హైరింగ్ డ్రైవ్కు అడ్డంకి కాదని ఆయన అన్నారు. గతేడాది తాము ఆన్లైన్లో నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్కు 3.60 లక్షల మంది ఫ్రెషర్స్ హాజరైనట్లు ఆయన తెలిపారు.
ఇన్ఫీ35,000
దేశీయ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35,000 కాలేజ్ గ్రాడ్యుయేట్లను తీసుకుంటామని తెలిపింది. ఇప్పుడీ కంపెనీలో 2.67 లక్షల మంది ఉద్యోగులున్నారు. డిజిటిలైజేషన్తో ఈ సేవలకు భారీ డిమాండ్ ఏర్పడిందని, దాంతో తాజా నియామకాల్ని పెంచుతున్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్రావు చెప్పారు. కాలేజ్ క్యాంపస్ల నుంచి 35,000 మంది గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుంటామని ఆయన ప్రకటించారు.
విప్రో 30,000
విప్రో కూడా భారీ నియామక ప్రణాళికను వెల్లడించింది. ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య తొలిసారిగా 2లక్షల మార్క్ను దాటి 2,09,890కి చేరింది. ఈ ఏప్రిల్-జూన్లో దాదాపు 10,000కుపైగా నైపుణ్యం గలవారిని రిక్రూట్ చేసుకోగా, 2,000 మంది ఫ్రెషర్స్ను తీసుకున్నది. జూలై-సెప్టెంబర్లో 6,000 మంది ఫ్రెషర్స్ కంపెనీలో చేరుతున్నారని కంపెనీ సీఈవో థైరీ డెలపోర్టే తెలిపారు. 2023 ఆర్థిక సంవత్సరంలో చేరేందుకు ప్రస్తుత ఏడాది 30,000 ఆఫర్ లెటర్స్ పంపిస్తామని ఆయన ప్రకటించారు.
మరిన్ని నియామకాలు..
ఇప్పటివరకూ ఫలితాల్ని వెల్లడించిన మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు మైండ్ట్రీ, ఎల్అండ్టీ టెక్నాలజీలు కూడా రిక్రూట్మెంట్స్ పెంచనున్నట్లు ప్రకటించాయి. మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలూ రానున్న కొద్దిరోజుల్లో వాటి రిక్రూట్మెంట్ డ్రైవ్లను వెల్లడించనున్నాయి.
0 Response to "More than one lakh jobs this year"
Post a Comment