Ten and Inter results when
పది మరియు ఇంటర్ ఫలితాలు ఇంకెప్పుడు
- టెన్త్, ఇంటర్ రిజల్ట్స్పై ఛాయారతన్ కమిటీ ‘ఫార్ములా’
- ఫలితాల కోసం 11 లక్షల మంది.
- విద్యార్థుల ఎదురుచూపులు
పదో తరగతి, ఇంటర్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ప్రక్రియకు అవసరమైన విధానపు ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడుతోంది. కొవిడ్-19 కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి టెన్త్, ఇంటర్ సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై ఫార్ములాను రూపొందించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఎం.ఛాయారతన్ నేతృత్వంలో వేర్వేరు కమిటీలను నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలు 2020-21లో నిర్వహించిన రెండు ఫార్మేటివ్ అసె్సమెంట్ (ఎఫ్ఏ) పరీక్షల మార్కులను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఫార్ములాను తయారుచేశాయి. విద్యార్థి రాత పరీక్షలో 20 మార్కులకు సాధించిన మార్కులను 70 శాతం గాను, మిగిలిన మూడు అంశాలలో కలిపి 30 మార్కులకు సాధించిన మార్కులను 30 శాతం గానూ పరిగణించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా ఎఫ్ఏ-1, ఎఫ్ఏ-2లో వచ్చిన మార్కులతో గ్రేడింగ్లు ఇస్తూ తుది ఫలితాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. దానిని పాఠశాల విద్యా శాఖ పరిశీలించి మార్కుల మదింపు ఫార్ములా, గ్రేడింగ్కు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. కానీ, రోజులు గడుస్తున్నా ఉత్తర్వులు మాత్రం విడుదల చేయలేదు. ఈ ఉత్తర్వులు లేకుండా ఫలితాలను ప్రకటించే అవకాశం లేదు. ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఇంటర్ సెకండియర్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంత వరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయకపోవడం గమనార్హం.
0 Response to "Ten and Inter results when"
Post a Comment