Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

This time we will edit the Group-1 answer sheets by hand.

 గ్రూప్ -1 జవాబుపత్రాలను ఈసారికి చేతితోనే దిద్దిస్తాం.

This time we will edit the Group-1 answer sheets by hand.


సమయం ఆదాకే హైకోర్టు తీర్పుపై 'సుప్రీం'కి వెళ్లడంలేదు

రెండు రోజుల్లో జూనియర్‌ అసిస్టెంట్ల నోటిఫికేషన్‌ జారీ
ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడి

ఈనాడు, అమరావతి: హైకోర్టు ఆదేశాలను గౌరవించి గ్రూపు-1 ప్రధాన పరీక్షల జవాబుపత్రాలను సంప్రదాయ విధానంలోనే మూల్యాంకనం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు.

ఈ ప్రక్రియను మూడు నెలల్లో ముగించి, ఫలితాల వెల్లడికి కృషి చేస్తామన్నారు. మున్ముందు వచ్చే గ్రూపు-1 నోటిఫికేషన్ల ప్రధాన పరీక్షల జవాబుపత్రాలను డిజిటల్‌ విధానంలోనే మూల్యాంకనం చేయాలని కమిషన్‌ నిర్ణయించిందన్నారు. ఈమేరకు విజయవాడలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ''ఏపీపీఎస్సీ చేపట్టిన జవాబుపత్రాల డిజిటల్‌ మూల్యాంకనాన్ని హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదు. నోటిఫికేషన్‌లో డిజిటల్‌ విధానంపై చెప్పనందున జవాబుపత్రాలను చేతితోనే దిద్దాలని ఆదేశించింది. కొవిడ్‌ నేపథ్యంలో డిజిటల్‌ మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాం. దీనిగురించి సాధ్యమైనంత ముందుగానే అభ్యర్థులకు తెలియచేస్తూ వచ్చాం. హైకోర్టు తాజా ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే... తుదితీర్పు వచ్చేందుకు ఆలస్యం కావొచ్చు. ఈ పరిస్థితుల్లో జవాబుపత్రాలను చేతితోనే దిద్దించాలని కమిషన్‌ నిర్ణయించింది. డిజిటల్‌, సంప్రదాయ పద్ధతిలో జరిగే మూల్యంకనాలలో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఓ ఉపాధ్యాయుడు ఆరు నెలల కిందట దిద్దిన జవాబుపత్రాన్ని మళ్లీ ఇప్పుడు దిద్దితే వచ్చే మార్కుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇది సహజం. డిజిటల్‌ మూల్యాంకనం పారదర్శకంగానే జరిగింది. గతంలో ఐపీఎస్‌, ఇతర కేడర్ల ఉద్యోగాలకు ఎంపికై... ఐఏఎస్‌ కోసం మళ్లీ సివిల్స్‌ రాస్తే ప్రిలిమ్స్‌లోనే వెనుకబడిన వారు ఉన్నారు. ప్రశ్నపత్రం, ఇతర పరిణామాలు అనుసరించి అభ్యర్థులకు మార్కులు వస్తాయి'' అని వివరించారు. కమిషన్‌ ఛైర్మన్‌ గురించి హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై ప్రశ్నించగా ''అది కమిషన్‌ అంతర్గత విషయం'' అని కార్యదర్శి సమాధానమిచ్చారు.

పెరగనున్న గ్రూపు-1, 2 ఉద్యోగ ఖాళీలు

గ్రూపు-1, 2 ఉద్యోగ ఖాళీలు పెంచాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించిందని కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు వెల్లడించారు. ''ప్రభుత్వ ఆదేశాలతో ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 650 జూనియర్‌ అసిస్టెంట్ల ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లోనే నోటిఫికేషన్‌ ఇస్తాం. ఈ వారంలోనే అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేస్తాం. గత 18 నెలల్లో 30 నోటిఫికేషన్ల ద్వారా మూడు వేల నియామకాలు పూర్తిచేశాం. న్యాయ వివాదం కారణంగా పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోంది. కొవిడ్‌ సమయంలోనూ దేశంలోనే అధిక సంఖ్యలో నియామకాలు ఏపీపీఎస్సీ ద్వారానే జరిగాయి. శాఖాపరమైన పరీక్షల ఫలితాలను 24 నుంచి 48 గంటల్లోనే వెల్లడించాం'' అని వివరించారు.

'క్యాలెండర్‌'ను అనుసరించడంలో ఇబ్బందులు

క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ ప్రకటనల జారీలో సమస్యలొస్తున్నట్లు కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు. ''కేంద్రాల ఎంపికలో సంక్లిష్టత కారణంగా నోటిఫికేషన్ల జారీ సమయంలోనే పరీక్షల తేదీలు ప్రకటించలేకపోతున్నాం. ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి, దరఖాస్తులు స్వీకరిస్తాం. ఆ తరువాత పరీక్షల తేదీలు ప్రకటిస్తాం'' అని తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "This time we will edit the Group-1 answer sheets by hand."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0