Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

An additional burden in the name of development charges on electricity consumers who take on new connections

కొత్త కనెక్షన్లు తీసుకునే విద్యుత్‌ వినియోగదారులపై అభివృద్ధి ఛార్జీల పేరిట అదనపు భారం.
An additional burden in the name of development charges on electricity consumers who take on new connections

  •  కొత్తగా విద్యుత్తు కనెక్షన్లు తీసుకునే వారిపై భారం
  • డిస్కంల ప్రతిపాదనకు ఏపీఈఆర్‌సీ ఆమోదం

కొత్త కనెక్షన్లు తీసుకునే విద్యుత్‌ వినియోగదారులపై అభివృద్ధి ఛార్జీల పేరిట అదనపు భారం పడనుంది.

కొత్త కనెక్షన్‌ తీసుకునేటప్పుడు వినియోగదారుల నుంచి అభివృద్ధి ఛార్జీల పేరిట వసూలు చేస్తున్న మొత్తాన్ని పెంచాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2019లో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిలో (ఏపీఈఆర్‌సీ) పిటిషన్‌ దాఖలు చేశాయి. వాటి పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత అభివృద్ధి ఛార్జీలను పెంచుతూ ఏపీఈఆర్‌సీ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ఛార్జీలు తక్షణం అమల్లోకి వస్తాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునేటప్పుడు కాంట్రాక్ట్‌ లోడ్‌ (విద్యుత్‌ వినియోగ ప్రతిపాదన) ఆధారంగా అభివృద్ధి ఛార్జీలను వినియోగదారులు డిస్కంకు చెల్లించాలి. ఈ ఛార్జీల పెంపుతో గృహ, వాణిజ్య వినియోగదారులపై కిలోవాట్‌కు రూ.200 నుంచి 600 వరకు అదనపు భారం పడనుంది. అదనపు లోడ్‌కు వసూలుచేసే అభివృద్ధి ఛార్జీలనూ డిస్కంలు భారీగా పెంచాయి. కొత్త విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఏటా సుమారు లక్ష దరఖాస్తులు వస్తాయని డిస్కంలు తెలిపాయి. ఇప్పటికే విద్యుత్‌ కనెక్షన్‌ పొందిన వినియోగదారులు కూడా అదనపు లోడ్‌ కోసం చేసుకునే దరఖాస్తులకు కొత్త అభివృద్ధి ఛార్జీల ప్రకారం చెల్లించాలని డిస్కంలు తెలిపాయి.

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు కిలో వాట్‌కు ప్రస్తుతం రూ.1,200 అభివృద్ధి ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. కొత్త ఛార్జీల ప్రకారం కిలోవాట్‌కు రూ.1,500 చెల్లించాలి.

పరిశ్రమలు, స్థానిక సంస్థలు, తాగునీటి పథకాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇతర ఎల్‌టీ కేటగిరీ వినియోగదారులు కాంట్రాక్ట్‌ లోడ్‌ ఆధారంగా కిలోవాట్‌కు రూ.2 వేల వంతున అభివృద్ధి ఛార్జీలు చెల్లించాలి. పాత ఛార్జీల ప్రకారం కిలో వాట్‌కు రూ.1,200 వంతున డిస్కంలు వసూలు చేస్తున్నాయి.

కాంట్రాక్ట్‌ లోడ్‌ 20 కిలోవాట్లకు మించితే.. వారికి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడానికి ఏపీఈఆర్‌సీ అనుమతించింది. వారి నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ కొనుగోలు ఖర్చును వసూలుచేసి అభివృద్ధి ఛార్జీల వసూలు నుంచి మినహాయింపు ఇవ్వాలంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "An additional burden in the name of development charges on electricity consumers who take on new connections"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0