AP Employees Strike
AP Employees Strike : ఏపీ ఉద్యోగులపై ప్రభుత్వం కన్నెర్ర .. ఎస్మా దిశగా అడుగులు .. ఏఏ శాఖలపైఉంటుందో చూడాలి
AP Employees Strike: ఆంధ్రప్రదేశ లో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల పోరు తారీ స్థాయికి చేరింది. ఇక ఎదురు చూపులు లేవని మంత్రులు కమిటీ తేల్చి చెప్పేసింది..
అయితే ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్నట్టు సమాచారం. అత్యవసరమైతేనే ఎస్మా ఉపయోగించాలని అధికారులకు సూచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ముందుగా సమ్మెను విరమింపచేసే ప్రయత్నాలు చేయలని.. తప్పని సరి పరిస్థితి తలెత్తితే.. అత్యవసర సేవలపై మాత్రమే ఈ ఎస్మా అస్త్రాలను ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సమ్మెలను నిషేధిస్తూ ఇటీవలే జీవో జారీ చేసింది విద్యుత్ శాఖ.
తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ ఎండీకి ప్రత్యేక నోటీసు అవసరం లేదని.. సీఎస్కు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన నోటీసు చాలంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కు తీసుకోకుండా.. ఎన్ని హామీలు ఇచ్చినా ఉద్యోగులు నమ్మే పరిస్తితి లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి అందచేశారు వైద్య, విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఇదే సమంలో మరోవైపు జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్కు సహకరించడం లేదు ఉద్యోగులు.
ఇప్పటి వరకు 4.50 లక్షల బిల్లులకు గానూ.. కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయ్యాయంటోంది ఆర్థిక శాఖ. పరిస్థితి చేయిదాటకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఉద్యమం నుంచి వెనక్కు తగ్గేదే లేదంటున్నారు ఉద్యోగులు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.. సమ్మె తప్పని సరి అయినప్పుడు.. ఎస్మా బాణం ప్రయోగిస్తుందా.. అంత వరకు పరిస్థితి రాకుండా ముందే దిద్దుబాటు చర్యలు చేపడుతుందా అన్నది తేలాలి..
0 Response to "AP Employees Strike "
Post a Comment