Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Tenth Exams

 AP Tenth Exams: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే

AP Tenth Exams


ఏపీలోని టెన్త్ విద్యార్థులకు (AP Tenth Students) సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎగ్జామ్స్ (Tenth Exams) పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


కరోనా నేపథ్యంలో అత్యంత ఎక్కువ నష్టం విద్యార్థుల భవిష్యత్ కే జరుగుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు గతేడాది మొత్తం దాదాపుగా ఆన్లైన్ విధానంలోనే క్లాసులు జరిగాయి. అనేక పరీక్షలను ఆయా ప్రభుత్వాలు రద్దు చేశాయి. గతేడాది నిర్వహించిన ఆన్లైన్ క్లాసులు విద్యార్థులు ఎంత మేరకు అర్థం అయ్యాయో తెలియని దుస్థితి

ఈ ఏడాది ప్రత్యక్షంగా తరగతులు నిర్వహిస్తున్నా.. ఈ కరోనా దెబ్బకు అవి ఎంత వరకు కొనసాగుతాయో తెలియని ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా టెన్త్, ఆపై తరగతుల విద్యార్థులు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది.

సిలబస్ సమయానికి పూర్తి అవుతుందా? లేదా? అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని సీఎం జగన్ సర్కార్ టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షల పేపర్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు టెన్త్ ఎగ్జామ్ ను 11 పేపర్లలో నిర్వహించేవారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను 7కు కుదించింది జగన్ సర్కార్. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను సైతం ఏడు పేపర్లతోనే నిర్వహించున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అన్ని సబ్జెక్టులకు ఒకే ఎగ్జామ్ ఉండగా.. ఒక సైన్స్ మాత్రం రెండు పేపర్లను నిర్వహించనున్నారు. ఇందులో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి 50 మార్కులకు ఒక పేపర్, జీవశాస్త్రానికి 50 మార్కులకు ఉంటుంది. మిగతా అన్ని సబ్జెక్టులకు ఎగ్జామ్ ను ఒకే పేపర్ ద్వారా 100 మార్కులకు నిర్వహిస్తారు.

ఇదిలా ఉంటే ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 8వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటిచింది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ తాజాగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

అయితే కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, సంక్రాంతి పండుగ నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సెలవు దినాల్లో ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Tenth Exams"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0