Kovid tablets have arrived
కోవిడ్ ట్యాబ్లెట్స్ వచ్చేశాయి
- ఐదు రోజుల కోర్సు రూ .1,399 మాత్రమే '
- మోలు లైఫ్ ( 200 ఎంజీ ' పేరుతో
- మాత్రలు విడుదల చేసిన మ్యాన్ కైండ్ ఫార్మా
న్యూఢిల్లీ , జనవరి 5 : కరోనా వైరస్ మళ్లీ భయపెడుతున్న వేళ ప్రజలకు ఇది . కొంత ఊరటనిచ్చే వార్తే . ఇకపై దగ్గు , జలుబు , జ్వరానికి కొనుక్కుంటున్నట్టుగానే మెడికల్ షాపులో కొవిడ్ మాత్రలను కొనుగోలు చేసుకోవచ్చు . అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్నుపిరవిర్ మాత్రలు ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి . ' మోలు లైఫ్ ( 200 ఎంజీ ) ' పేరుతో వచ్చిన ఈ ట్యాబ్లెట్లను మన దేశంలో మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ విడుదల చేసింది . ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సి ఉంటుంది . ధర రూ .1,899 మాత్రమే . ఒక్కో డబ్బాలో 40 మాత్రలు ఉంటాయి . ఉదయం నాలుగు , సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాలి . అంటే పూటకు 800 ఎంజీ డోసు అన్నమాట . అయితే , వీటిని వైద్యుల సిఫారసుతోనే వాడాల్సి ఉంటుంది . కరోనాకు ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం మన దేశంలో ఇదే తొలిసారి . ఈ మాత్రలను మన దేశంలో హెటెరో , డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి . ఆయా సంస్థను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది . ఈ క్రమంలో మ్యాన్ కెండ్ మాత్రం రూ .1,399 కే అందుబాటులోకి తీసుకురాగా , సన్ఫార్మా రూ .1,500 , డాక్టర్ రెడ్డీస్ రూ .1,400 ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది . అమెరికాలో మాత్రం వీటి ధర భారత కరెన్సీలో రూ . 52 వేలు . ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే తక్కువగా ఉండడంతోపాటు ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్లను ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి నిచ్చింది .
0 Response to "Kovid tablets have arrived"
Post a Comment