AP: Final notification on formation of new districts by March 31.
AP : మార్చి 31 న కొత్త జిల్లాల ఏర్పాటు పై తుది నోటిఫికేషన్.
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు తుదిదశకు చేరుకుంది. ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు సీఎం.
ఏపీ ప్రభుత్వం 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినసంగతి తెలిసిందే. జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల మార్పు మొదలైన అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ లోపే భారీగా ఉద్యోగ బదిలీలకు కసరత్తు ప్రారంభించారు. నోటిఫికేషన్ తరువాత కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల ట్రాన్స్ఫర్ జరగనున్నాయి.
0 Response to "AP: Final notification on formation of new districts by March 31."
Post a Comment