Mobile attendance for teachers
టీచర్లకు మొబైల్ అటెండెన్స్
- నేడు జారీ కానున్న మార్గదర్శకాలు
- నూతన విధానంలోనూ సమస్యలు ?
బయోమెట్రిక్, ఐరిస్ యంత్రాల మొరాయింపు, సాంకేతిక సమస్యలతో పాఠశాలల్లో దాదాపు రెండేళ్లుగా టీచర్ల హాజరు నమో దు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా హాజరు నమోదు చేపట్టే విధానాన్ని ప్రవేశపెట్ట నున్నారు. నూతన పద్ధతిని ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా గుంటూరు జిల్లాలో కొన్ని పాఠశాలల్లో అమలు చేసి పరీక్షించగా సమస్యలు తలెత్తకపోవడంతో రాష్ట్రమం తటా విస్తరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. విద్యాశాఖ రూపొందించిన మొబైల్ అటెండెన్స్ యాప్ను టీచర్లతో వారి ఆండ్రా యిడ్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయిస్తారు. యాప్ను ఓపెన్ చేసి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(టీఐఎస్)లో నమోదు చేసుకున్న మొబైల్ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి, వ్యక్తి గత పాస్వర్డ్ ద్వారా ఉపాధ్యాయులు లాగిన్ అవుతారు. ఇలా ఓపెన్ చేసిన యాప్లోకి సెల్ఫీ తీసుకునేలా చూడడం ద్వారా ముఖ గుర్తింపు (ఫేసియల్ రికగ్ని షన్)తో హాజరు నమోదవుతుంది. టీచర్లు అతి తక్కువ వ్యవధిలోనే తమంతట తాముగా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఇలా హాజరు నమోదు చేసుకోవచ్చు.
నూతన విధానంలోనూ పలు సమస్యలే ?
విద్యాశాఖ రూపొందించిన యాప్ ద్వారా టీచర్ల హాజరు నమోదులోనూ పలు క్షేత్రస్థాయి సమస్యలు తలెత్తవచ్చునని చెబుతున్నారు. గూగుల్ మ్యాప్స్ ఏరియాల వారీగా నిర్దేశించిన లాంగిట్యూడ్, లాటిట్యూ డ్ పాయింట్లను ప్రామాణికంగా తీసుకోవడంతోపాటు, ఆ మేరకు సంబంధిత స్కూలు ఏరియాకు ఇచ్చిన పాయింట్లు మ్యాచ్ అయితేనే యాప్లో టీచర్ల హాజరు విజయవంతంగా నమోదవుతుంది. దీనికి అనుగుణంగా సంబంధిత ఏరియాలో 300 మీటర్ల పరిధిలో ఉపాధ్యా యులు ఉంటేనే హాజరు నమోదు సాధ్యమవుతుంది. గూగుల్ మ్యాప్స్ డేటా, క్షేత్రస్థాయి డేటాలో ఒకటి, రెండు పాయింట్లు(లాంగిట్యూడ్, లాటిట్యూడ్) వ్యత్యాసం ఉన్నా అటెన్డెన్స్ నమోదు కాదని చెబుతు న్నారు. నెట్వర్క్ స్పీడుగా ఉంటేనే ఫేస్ రికగ్నేషన్ సాధ్యమవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
0 Response to "Mobile attendance for teachers"
Post a Comment