Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavadi

అమ్మ ఒడికి ఆంక్షలు

Ammavadi

  • విద్యుత్‌ వాడకం 300 యూనిట్లు దాటితే కట్‌
  • ఆధార్‌ కార్డులో కొత్త జిల్లాల పేర్లు చేర్చుకోవాలి
  • 75 శాతం హాజరు తప్పనిసరి
  • వలంటీర్ల వద్ద విద్యార్థుల పేర్లు, వయసు సరిచూసుకోవాలి

జగనన్న అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. విద్యార్థుల హాజరు నుంచి వారి ఇళ్లలో విద్యుత్‌ బిల్లు వరకు నిర్దేశించిన ప్రకారం ఉంటేనే ఇక ఈ సాయం అందుతుంది. కుటుంబ గృహ విద్యుత్‌ వాడకం 300 యూనిట్ల లోపే ఉండాలి. అది దాటితే పథకానికి అనర్హులవుతారు. అదేవిధంగా ఇకపై హాజరు శాతాన్ని సీరియ్‌సగా పరిగణిస్తారు. వాస్తవానికి గతంలోనే అమ్మఒడి కింద లబ్ధి పొందాలంటే 75శాతం హాజరు తప్పనిసరనే నిబంధన విధించారు. కొవిడ్‌ నేపథ్యంలో దాన్ని తొలినాళ్లలో పెద్దగా పట్టించుకోలేదు. ఆ షరతుకు మినహాయింపు ఇచ్చారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉన్నవారికే.. వచ్చే విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి అందిస్తారు. అలాగే ఆధార్‌ కార్డులో పాత జిల్లాల పేర్లు మార్చి కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి. అమ్మ ఒడి కింద లబ్ధి పొందాలనుకునేవారంతా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి.. అందులో పాత జిల్లా పేరును మార్చి కొత్త జిల్లా పేరు అప్‌డేట్‌ చేసుకోవాలి.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమ్మ ఒడికి అర్హత ఎవరెవరికి ఉంటుందో ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి సవివరంగా తెలియజేశారు. బియ్యం కార్డు కొత్తది ఉండాలి.. ఇంటింటి సర్వే మ్యాప్‌లో పిల్లవాడు/పిల్ల, తల్లి ఒకే మ్యాపింగ్‌లో ఉండాలి. విద్యార్థి ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలి. వలంటీర్ల వద్దకు వెళ్లి విద్యార్థి పేరు, వయసు సరిచూసుకోవాలి. తల్లుల బ్యాంకు ఖాతా నంబరుకు ఆధార్‌ లింక్‌ అయిందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఆధార్‌ నంబరును ఫోన్‌ నంబరుతో కూడా లింక్‌ చేయించుకోవాలి. బ్యాంకు ఖాతా రన్నింగ్‌లో ఉండాలి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేవాళ్లకు అమ్మఒడి వర్తించదు. ఇలాంటి వారిలో ఎవరైనా అమ్మఒడి తీసుకుంటే.. ఇప్పటికే తీసుకుని ఉన్నా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఒక ఏడాది నష్టం..!

 ఏటా సుమారు 44 లక్షల మంది అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందుతున్నారు. దీని కింద ఒక విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నారు. ఇందులో రూ.1,000ని పాఠశాలల ఆయాల జీతాల కోసం మినహాయించి మిగతా రూ.14 వేలు ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అందిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. ఏటా జనవరిలో ఈ పథకం కింద డబ్బులివ్వాలి. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రం జనవరిలో కాకుండా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జూలైలో ఇస్తామని పేర్కొన్నారు. దీనివల్ల ఒక ఏడాది ఇవ్వకుండా ఆపినట్లే. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammavadi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0