End of 10th class spot
ముగిసిన'పది' మూల్యాంకనం
- జూన్ రెండో వారంలో ఫలితాలు వెల్లడి
- ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి
పదో తరగతి పబ్లిక్ పరీక్ష లకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగిసిందని ప్రభుత్వపరీక్షల రాష్ట్ర డైరెక్టర్ దేవానందరెడ్డి తెలి పారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆది వారం జరిగిన మూల్యాంకన ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఈ ఏడాది 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం. చేసేలా 20 వేల మంది ఉపాధ్యాయుల ను విధులకు కేటాయించామన్నారు. 13 జిల్లాల నుంచి మూల్యాంకన నివే దికలు విజయవాడ చేరుతున్నాయని. పది రోజుల్లో వీటికి సమగ్ర రూపు తీసు కొస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడిం చారు. జూలై మొదటి వారం లేక రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు దేవానందరెడ్డి వివరించారు.
0 Response to "End of 10th class spot "
Post a Comment