Hybrid education!
హైబ్రిడ్ విద్య!
- ఇదే నేటి ఆవశ్యకత
- ఆన్లైన్లో 40శాతం విద్య యథాప్రకారం క్లాసులు
- ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ
జాతీయ విద్యావిధానం -2020పై శనివారం నాడు ఇక్కడ జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షత వహించారు. సంప్రదాయ విద్యతోపాటు సాంకేతిక పరమైన విద్యను బడుల స్థాయి నుంచే పిల్లలకు బోధించాలనీ, హైబ్రీడ్ విద్యావిధానం నేటి ఆవశ్యకత అని ప్రధాని అన్నారు.బడుల్లోనే కాకుండా ఆన్లైన్ విద్యాబోధనకు పిల్లలు అలవాటు పడేట్టు చూడాలని సూచించారు. కరోనా సమయంలో బడులు మూత పడినప్పుడు ఆన్లైన్ ద్వారా పాఠాలు నేర్చుకోవడానికి పిల్లలు అలవాటు పడిన సంగతిని ఆయన గుర్తు చేస్తూదీనిని కొనసాగించాలనీ, అదే సందర్భంలో ప్రాక్టికల్ క్లాసులు నిర్వహణ యథాప్రకారం కొనసాగేట్టు చూడా లని ఆయన సూచించారు. ఆన్లైన్ కోర్సుల్లో పరిమితి 40 శాతం ఉండేట్టు చూ డాలని ఆయన సూచించారు. స్కూళ్ళలో విద్యార్థినీ విద్యార్ధులకు క్రమం తప్ప కుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలనీ, పౌష్టికాహారం పిల్లలకు పంపిణీ అయ్యేట్టు చూడాలని కోరారు. పిల్లల ఆటల్లో ఉపయోగించే బొమ్మలలో స్వదేశీ ఉత్పత్తులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు పి లలలో విద్యాప్రమాణాలను పెంచేందుకు నిపుణా భారత్, బాలవాటికా, విద్యాప్రవేశ్ పథకాలను అమలు చేయాలని సూచించారు. పిల్లల్లో కొత్త ఆలోచ నలను కనుగొని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఆవిష్కరణలకు ప్రాథమిక విద్యా దశ నుంచే ప్రోత్సాహం ఇవ్వాలని ఆయనసూచించారు.
0 Response to "Hybrid education!"
Post a Comment