Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavodi

 Ammavodi : విద్యార్థులకు గుడ్ న్యూస్. తల్లుల ఖాతాలో డబ్బులు పడేది ఎప్పుడంటే? అర్హులో కాదో చెక్ చేసుకోగలరు.

Ammavodi

Ammavodi: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఇప్పటికే విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నెన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో విద్యా కానుక ఒకటి, మరోకటి అమ్మ ఒడి పథకాలు.. విద్యా కానుక కింద విద్యార్థులకు కావలసిన పుస్తకాలను, బ్యాగ్స్, తదితర వస్తువులను అందజేస్తున్నారు. అమ్మ ఒడి పథకంలో విద్యార్థులకు 15 వేల నగదును అంద చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.

మొదట 2022 జనవరిలో ఈ నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. వివిధ కారాణాలతో అమ్మ ఒడి డబ్బులు విడుదల చేసే తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ అమ్మఒడి పథకం ఈ ఏడాది ఆలస్యం అవ్వడంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అలాగే షరుతులు కూడా పెంచినట్టు ప్రచారం ఉంది. దీంతో ఈ సారి అమ్మఒడి పథకం ఎప్పుడా ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులు తల్లుల అకౌంట్లో జమ అయ్యాయి. ఇప్పుడు మూడో విడుత సాయాన్ని త్వరలోనే జమ చేయనున్నారు.. తాజాగా ఈ విషయం పై మరో అప్డేట్ ను అధికారులు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన అమ్మ ఒడి డబ్బులను తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు.

సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన లో భాగంగా బటన్ నొక్కి మూడో విడత డబ్బులను విడుదల చేస్తారు.ఈ ఏడాదికి 41 లక్షల మంది ఈ సాయన్ని పొందనున్నారు. అయితే ఈ సారి చాలామంది లబ్ధి దారుల పేర్లు మిస్ అయినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని షరుతులతో ప్రభుత్వం తొలగించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్తగా చేరిన లబ్ధి దారుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అయితే, ఈ జాబితాలో తమ పేర్లు లేవని చాలా మంది తల్లులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. అలా ఎవరైనా తాము అర్హులమకాదా అని చెక్ చేసుకోవాలి అంటే.. గ్రామ, వార్డు సచివాలయంకు వెళ్లి తెలుసుకోవచ్చు.. లేదా వాలంటీరును సంప్రదించిన లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు.

మరోవైపు స్కూల్స్ నిర్వహణ 2 వేలు వుంచి, మిగిలిన నగదును 13 వేలను తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. దీనిపైనా వివాదం నెలకొంది. మొదట 15 వేలు ఇస్తామని చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు రెండు వేలు కోత విధించడం ఏంటని కొందరు తల్లులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్ నిర్వహణ ఖర్చులు విద్యార్థుల నుంచి వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 43,19,090 మంది తల్లుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించారు. ఇందులో 41,70,203 మంది తల్లుల ఈకేవైసీ పూర్తయింది. అర్హత కోల్పోయిన వారి జాబితాలను మాత్రం సచివాలయాలకు పంపించలేదు. దీంతో లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయం అధికారులను ప్రశ్నిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammavodi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0