In August 'Tet
ఆగస్టులో 'టెట్
- త్వరలో షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ.
- పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు
- సిలబస్ ఖరారు చేసిన ఎస్సీఈఆర్టీ.
- టెట్ సర్టిఫికెట్కు జీవితకాల చెల్లుబాటు
- డీఎస్సీలో 20% వెయిటేజీ
- డీఎడ్ అభ్యర్థులతో పాటు గతంలో రాసినవారూ సన్నద్ధం
ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (బెట్ 2022) ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పేపర్లవారీగా పరీక్షల తేదీలు, ఇతర సమా చారంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయ నుంది. టెట్ రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజు తెలుగా ఎదురు చూస్తున్నారు. జాతీయ ఉపా ధ్యాయ విద్యామండలి (ఎన్ సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించా ల్సిన గత సర్కారు పట్టించుకోలేదు. అధికా రంలో ఉండగా టెట్, డీఎస్సీ కలిపి టీచర్ ఎలి జిబులిటీ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టెట్ కమ్ టెర్రీ) పేరుతో నిర్వహించినా క్వాలిఫైడ్ అభ్యర్ధుల ధ్రువపత్రాలను ఏడేళ్లుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇలా రెండు పరీక్షలు కలిపి నిర్వహించడంతో అభ్యర్ధులు నష్టపోయారు. 2018లో టెట్ నిర్వహిం చాల్సి ఉన్నా ఎన్నికలు రావడంతో నిలిచిపోయింది.
డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ
దీర్ఘకాలంగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్ధులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. బెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్ సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.
వెబ్సైట్లో ప్యాట్రన్, సిలబస్
టెట్ 2021 విధివిధానాలు, సిలబస్ ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్ను https://aptet.apcfss.in వెబ్సైట్లో పొందుపరి చింది. బెట్లో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. వీటిని 1 వ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్థుల అర్హతలకు సంబంధించి ఎన్సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్థులకు మేలు చేకూరేలా టెట్ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు.
ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే.
- రెగ్యులర్ స్కూళ్లలో 1 - 5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1ఏలో అర్హత సాధించాలి..
- దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్లలో 1 5 తరగతులు బోధించాలంటే పేపర్ 1బీలో అర్హత తప్పనిసరి.
- రెగ్యులర్ స్కూళ్లలో 6 - 8. ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2 బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
- టెట్లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
0 Response to "In August 'Tet"
Post a Comment