Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What's in that report.

ఆ నివేదికలో ఏముందో.

What's in that report.

వణుకుతున్న డీఈఓ కార్యాలయ ఉద్యోగులు

ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన ఆర్‌.ఎస్‌.గంగాభవానీ సంతకాన్ని పోర్జరీ చేసి కొందరు ఉపాధ్యాయులకు బదిలీలు, మరికొందరికి డిప్యూటేషన్లు వేసినట్లు విచారణాధికారి తన దర్యాప్తులో నిగ్గు తేల్చారు. మూడు రోజుల క్రితం నివేదిక పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేయటంతో సంతకం ఫోర్జరీకి పాల్పడిన ఉద్యోగితో పాటు దొడ్డిదారిన బదిలీలు, డిప్యూటేషన్లు పొందిన ఉపాధ్యాయుల్లో అలజడి నెలకొంది. వారిని విధుల్లో చేర్చుకోవటం, జీతాలు చెల్లింపునకు దస్త్రాలు ప్రతిపాదించటం వంటివి డీఈఓ కార్యాలయ ఉద్యోగుల తప్పిదాల కిందకు వస్తాయని ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది.

ఈ తప్పిదాలకు అప్పటి కార్యాలయం సహాయ సంచాలకుడు, అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్లను బాధ్యులను చేసి వారిపై చర్యలకు సిపారసు చేసినట్లు సమాచారం. ఈ బదిలీల వెనక రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. టీచర్లను బదిలీ చేసే అధికారం గానీ, ఫారిన్‌ సర్వీస్‌పై నియామకం చేసే వెసులుబాటు గానీ డీఈఓకు లేదు. అయినా డీఈఓ పేరుతో బదిలీ ఉత్తర్వులొస్తే ఎలా జీతాల చెల్లింపునకు సిఫార్సు చేశారు? అన్నది ప్రశ్న. పిడుగురాళ్ల నుంచి గుంటూరు రూరల్‌ మండలానికి, క్రోసూరు మండలం నుంచి డీఈఓ కార్యాలయ ఏపీఓగా ఇద్దర్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించటం తొలుత వెలుగులోకి రాగా కమిషనర్‌ గుంటూరు ఆర్జేడీ సుబ్బారావును విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ విచారణతో మరికొన్ని అనధికారిక డిప్యూటేషన్లు బయటపడ్డాయి. గుంటూరు రూరల్‌ మండలం నుంచి ఒక ఉపాధ్యాయుడు అడవితక్కెళ్లపాడుకు, వెనిగండ్ల నుంచి ఒకరు,  బొల్లాపల్లి మండలానికి కౌన్సెలింగ్‌ బదిలీల్లో వెళ్లాల్సిన ఉపాధ్యాయుడొకరిని కౌన్సెలింగ్‌కు గైర్హాజరు చేయించి పెదపలకూరుకు ఆ తర్వాత డిప్యూటేషన్‌ వేసినట్లు సమాచారం. వీటిలో ఏ ఒక్కదానికీ కమిషనర్‌ అనుమతి లేదని చెబుతున్నారు. ఈ అక్రమాలకు కారకులైన డీఈఓ కార్యాలయ అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ నాయకులు ఇప్పటికే ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఖజనా అధికారుల తప్పిదాలు ఉంటే వారిపైనా చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు డిమాండు చేశారు.

డీఈఓకు ఇందులో ఎలాంటి సంబంధం లేదంటూ ఓ ఉద్యోగి ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశమవుతోంది. త్వరలో గంగాభవానీకి ఆర్జేడీగా పదోన్నతి రానుంది. ఈ తరుణంలోనే ఆమె సంతకాన్ని పోర్జరీ చేసి బదిలీలు చేసినట్లు వెలుగులోకి రావటంతో ఆమె సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What's in that report."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0