AP Sankar Good News to Students
AP : విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఏపీ సర్కార్ ఒక ఆఫర్ అగ్రకులాలవారికి కూడా
Andhra Students: విద్య, వైద్యం.. సీఎం జగన్(CM Jagan) అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజాగా ఏపీలోని విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. జగనన్న విదేశీ విద్యా దీవెన(Jagananna Vidya Deevena)పై ఉత్తర్వులు వెలువరించింది. పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ కూడా ఈ పథకంలో భాగం కల్పిస్తూ.. తాము ప్రతిభను ప్రొత్సహిస్తామన్న సంకేతాలు పంపింది. క్యూఎస్ ర్యాంకింగ్స్(QS World University Rankings)లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. 100పైబడి 200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు చేయనున్నట్లు తెలిపింది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్మెంట్ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా తెలిపింది. ఏపీలో స్థానికుడై ఉండాలి. అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబరు-డిసెంబరు, జనవరి-మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
0 Response to "AP Sankar Good News to Students"
Post a Comment