SSY Rules Changed : సుకన్య సమృద్ధి యోజన పథకంలో మార్పులు .. తప్పక తెలుసుకోగలరు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సేవింగ్ పథకాల్లో ఎక్కువగా వడ్డీ తెచ్చే పథకం సుకన్య సమృద్ధి యోజన.
బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ లో కంటే కూడా.. ఎక్కువగా పోస్టల్ లో సుకన్య సమృద్ధి యోజన పథకంలో డిపాజిట్ చేసిన అమౌంట్ కు ఎక్కువగా వడ్డీ వస్తుంది. ప్రస్తుతం 7.6 శాతం వడ్డీని ఈ పథకంలో ఇస్తున్నారు.
అయితే దీని గురించి ఈ విషయాలను తప్పక తెలుసుకోండి. ఈ ప్రత్యేక పథకంలో పెట్టుబడి పెట్టాలంటే.. 10 ఏళ్ల లోపు ఆడపిల్ల ఇంట్లో ఉండి ఉండాలి. ఆ ఆడపిల్ల పేరుమీదుగా ఈ పథకంలో చేరవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఒక దీర్ఘకాలిక పథకం. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ కుమార్తె విద్య, భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కనీసం రూ.250 డిపాజిట్తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత రూ.50 చొప్పున యాడ్ చేస్తూ ఎంతైనా జమ చేయొచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిననాటి నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ఒకవేళ కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్ డిఫాల్ట్ అవుతుంది. 15 ఏళ్ల లోపు ఎప్పుడైనా అకౌంట్ తిరిగి రెగ్యులరైజ్ చేయొచ్చు.
ఇందుకోసం ప్రతీ ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత డబ్బులు వడ్డీతో తిరిగి వస్తాయి. అమ్మాయికి 18 ఏళ్లు పూర్తైన తర్వాత లేదా 10వ తరగతి పాసైన తర్వాత ఉన్నత విద్య కోసం అకౌంట్లో 50 శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు.
ఇందుకోసం విద్యాసంస్థలో అడ్మిషన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. జమ చేసిన డబ్బుల్లో 50 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో తీసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. 21 ఏళ్ల లోపు కూడా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు.
18 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయి పెళ్లి చేస్తున్నటైతే సరైన ఆధారాలు చూపించి డబ్బులు విత్డ్రా చేయొచ్చు. పెళ్లికి నెల ముందు లేదా పెళ్లికి మూడు నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్తో పాటు వడ్డీ లభిస్తాయి.
అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని మార్పులు జరిగాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతా వార్షిక వడ్డీ జమ అవుతుంది. ఇంతకు ముందు ఈ పథకంలో 80సి కింద పన్ను మినహాయింపు ఇద్దరు కుమార్తెలకి మాత్రమే ఉండేది.
కొత్త నిబంధన ప్రకారం ఇద్దరు కవల కుమార్తెలు పుడితే వారితో పాటు మరొకరికి కూడా అవకాశం ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన కింద తెరిచిన ఖాతాను రెండు సందర్భాల్లో మూసివేయవచ్చు.
ముందుగా కూతురు చనిపోతే.. కూతురు చిరునమా మారితే ఖాతాను మూసి వేసి.. డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ కొత్త మార్పు ప్రకారం సంరక్షుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో కూడా.. ఖాతాను మూసివేయవచ్చు. పై రెండు నిబంధనలను ఈ పథకంలో మార్పులు చేశారు.
0 Response to "SSY Rules Changed"
Post a Comment