Continued concerns over the merger
మాబడి మాకే కావాలి
- పాఠశాలలకు తాళాలు, ధర్నాలు
- విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు
ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లలో విలీనం చేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ‘విలీనం ఆపేసి మా బడులను మాకే ఉంచాలి’ అంటూ నినదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా జిల్లాలోని పలుచోట్ల ఈ డిమాండ్తో పాఠశాలలకు తాళాలు వేయడం, ఎంఈవో కార్యాలయాలు, పాఠశాలల ఎదుట ధర్నాలు, ఇతర రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. జిల్లాలో సోమవారం కూడా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగాయి. కొండపి మండల పరిషత్ స్పెషల్ స్కూలులోని 3, 4, 5 తరగతులను అక్కడి హైస్కూలులో కలపడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠశాలను కొనసాగించాలని కోరుతూ ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు. సింగరాయకొండలోని ఆర్ఎస్ పాఠశాలలోని తరగతులను హైస్కూలులో విలీనం చేయడంపై విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం ఎస్సీ కాలనీలోని పాఠశాలను హైస్కూల్లో విలీనం చేయరాదంటూ బడికి తాళం వేసి నిరసన తెలిపారు. ఒంగోలు రూరల్ మండలం ఉలిచిలోని ప్రాథమిక పాఠశాలను హైస్కూలులో విలీనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అలాగే పలుచోట్ల నిరసనలతోపాటు అధికారులకు విన తిపత్రాలు అందజే శారు.
0 Response to "Continued concerns over the merger"
Post a Comment