If the schools are closed, it is my responsibility
పాఠశాలలు మూతపడితే నాదే బాధ్యత
- ఒక్క పాఠశాల కూడా మూత పడదు
- మంత్రి బొత్స సత్యనారాయణ
జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని చేపడుతున్నామని, ఈ ప్రక్రియలో ఎక్కడైనా ఒక్క పాఠశాల మూతప డినా తాను బాధ్యత వహిస్తానని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 3, 4, 5 తరగతులను తరలించిన తర్వాత ఆయా పాఠశాలల్లో 1, 2 తరగతులతోపాటు ఫౌండేషన్ స్కూల్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కార్య కర్తతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులను నియమి స్తామని తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల వినతులు, విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని జీవో 117కు సవరణలు చేస్తున్నామని వెల్లడించారు. | పాఠశాలల్లో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరో ఎస్ జీటీని, 150 మంది దాటితే ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 3, 4, 5 తరగతుల విలీనానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 270 పాఠశాలల విష యంలో కిలోమీటరు పరిధిలో నదులు, వాగులు, రహదారుల సమస్యలున్నట్లు గుర్తించామని..
దీనిపై ఉన్నతస్థాయి లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటా మని చెప్పారు. నాడు-నేడు ఫేజ్-1 పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, అందులో ఒకటి పూర్తిగా బాలికలకు కేటాయిస్తామని చెప్పారు. కేజీబీవీలు ఉన్నచోట రెండు కళాశాలలు అవసరం లేవను కుంటే వేరే చోటుకు తరలించే ఆలోచన చేస్తు న్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభించామని, క్యూఎస్ ర్యాంకింగ్ల పరిమితిని అవసరమైతే పెంచే విషయం ఆలోచిస్తామని వెల్లడించారు.
0 Response to "If the schools are closed, it is my responsibility"
Post a Comment