Government's decision on 'Teachers' Attendance' is final
'టీచర్ల హాజరు'పై ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్
ఉపాధ్యాయులు హాజరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఫైసల్ అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆ నిర్ణయాన్ని పాటించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిదాన్నీ ఉపాధ్యాయులపై కక్ష విశాఖలో సాధింపుగా చూడడం సరికాదన్నారు. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులు లేవ నెత్తే సమస్యలను పరిష్కరించాలని కోరారు. హాజరు విషయంలో ఫీల్డ్ స్టాఫ్కు మినహాయింపు ఇవ్వాలని, మారుమూల ప్రాంతాల్లో ఉండే నెట్వర్క్ సమ స్యలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరి ష్కారంలో పలువురు ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో లేరని, ఆర్థికేతర సమస్య లను సైతం పరిష్కరించడం లేదని ఆరోపించారు. పే స్కేల్ షెడ్యూల్స్ విష యంలో ఆలస్యం జరిగితే ఉద్యోగులు నష్టపోతారన్నారు. చనిపోయిన ఉద్యో గుల కుటుంబసభ్యులకు వీలైనంత త్వరగా ఉద్యోగాలివ్వాలని కోరగా.. ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయని.. వాటిని సవరించాలని కోరామన్నారు. సమావేశంలో సీహెచ్ రమేశ్, సత్తి నాగేశ్వరరెడ్డి, ఈర్లె శ్రీరామ్ముర్తి, అనిల్, జిలానీ, డి. రాజేంద్రవర్మ పాల్గొన్నారు.
0 Response to "Government's decision on 'Teachers' Attendance' is final"
Post a Comment