Release of 'Engineering' schedule
‘ఇంజనీరింగ్’ షెడ్యూల్ విడుదల
28 నుంచి ఆప్షన్ల నమోదు.
ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియను సాంకేతిక విద్యాశాఖ ప్రారంభించింది. ఇటీవల జేఈఈ రెండు విడతల ఫలితాలు వెలువడటంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లకు కౌన్సెలింగ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ బుధవారం షెడ్యూల్ ప్రకటించారు. గురువారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈనెల 22 నుంచి 30 వరకు ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ నిర్వహిస్తారు. 23 నుంచి 31 వరకు హెల్ప్లైన్ సెంటర్ల వద్ద సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవాలి. 28 నుంచి సెప్టెంబరు 2 వరకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 3న ఆప్షన్లను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది. 6 నుంచి 12వ తేదీల మధ్య కాలేజీల్లో రిపోర్టు చేయాలని, 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని భాస్కర్ తెలిపారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,94,752 మంది పరీక్షలు రాయగా 1,73,572 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 1.48 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్కు సబంధించి 25 హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటుచేశారు. వెబ్ కౌన్సెలింగ్లో పరిశీలనకు.. ఆన్లైన్ పేమెంట్ రశీదు, ఈఏపీసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, పదో తరగతి మార్కుల జాబితా, ఇంటర్ మార్కుల జాబితా, ఆరు నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, చివరిగా చదివిన కాలేజీ టీసీ, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను విద్యార్థులు వారితో ఉంచుకోవాలని సాంకేతిక విద్యాశాఖ తెలియజేసింది.
0 Response to "Release of 'Engineering' schedule"
Post a Comment