Andhra Pradesh : ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ సర్కార్ .వారికి మాత్రమే పదవీ విరమణ వయసు పెంపు వివరాలు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై దుమారం రేగుతోంది.
ఎవరెవరికి ఇది వర్తిస్తుందన్న దానిపై రకకాల చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ని 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన జీవోపై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన జీవో అందరికీ వర్తించదని ఏపీ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. కేవలం వారికి మాత్రమే పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచినట్లు పేర్కొంది.
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వర్తింపజేస్తూ.. ఆయా సంస్థలు ఉత్తర్వులు ఇవ్వడం తగదని తేల్చి చెప్పింది.
ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్. ఎస్. రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేసే వారికి మాత్రమే పదవీ విరమణ పెంచినట్లు తెలిపారు.
ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఏపీ ఆర్థికశాఖ ప్రశ్నించింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి నివేదికను పంపాలని ఆయా సంస్థలకు ఏపీ ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుబట్టుతున్నాయి. విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్, గురుకులాలు, సొసైటీలు, లైబ్రరీస్, పబ్లిక్ సెక్టార్ తదితర రంగాల ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
0 Response to "AP Sarkar shocked the employees. Retirement age increase details only for them."
Post a Comment