Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

నెల నెలా కట్టకపోతే జరిమానా!



  • జగన్‌ సర్కారుకు ఆదాయపన్ను శాఖ మరో లేఖ
  • ఉద్యోగుల జీతాల్లో నెలనెలా ఐటీ కట్‌
  • ఏడాది చివర్లో ఆ శాఖకు చెల్లిస్తున్న ప్రభుత్వం

ఇప్పటికే ఉద్యోగుల జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ డబ్బులు ప్రభుత్వం వాడేస్తోంది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు వేసినట్టే వేసి మళ్లీ ఉద్యోగుల ఖాతాల్లో నుంచి ప్రభుత్వం లాక్కున్న ఘటనలూ చూశాం. తాజాగా ఉద్యోగుల వేతనాల నుంచి కట్‌ చేస్తున్న(టీడీఎస్‌) మొత్తాన్ని ఏ నెలకానెల కట్టాలని, లేదంటే డీడీవోలకు ప్రతి నెలా ఒక శాతం పెనాల్టీ విధిస్తామంటూ ఐటీ శాఖ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆదాయ పన్ను కట్‌ చేస్తోంది. కానీ, ఐటీ శాఖకు మాత్రం ఏడాదికొక్కసారే.. అది కూడా మార్చి చివర్లో చెల్లింపులు చేస్తోంది. సీపీఎస్‌ ఉద్యోగుల జీతాల్లో కట్‌ చేేస 10 శాతాన్ని కూడా ప్రభుత్వం ఏ నెలకానెల డిపాజిట్‌ చేయడం లేదు. 

దీంతో వారు కూడా ఆ డబ్బు పెట్టుబడి ద్వారా వచ్చే రాబడిని కోల్పోతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐటీ శాఖ లేఖల మీద లేఖలు రాస్తున్నా తీరు మారడంలేదు. కాగా, ఉద్యోగుల జీతాల్లో నుంచి ఐటీని మినహాయించి లెక్కలేయడం వరకే డీడీవో పని. అలా అందరి జీతాల నుంచి కట్‌ చేసిన ఐటీ సొమ్ము దానికోసం ఉద్దేశించిన పీడీ ఖాతాలో జమవుతుంది. అక్కడ నుంచి ఆ సొమ్మును ఐటీ శాఖకు కట్టే బాధ్యత ట్రెజరీ డైరెక్టర్‌ది. వైసీపీ అధికారంలోకి వచ్చాక డీటీవో, పీఏవో బాధ్యతలను నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక శాఖ సెక్రటరీలే ప్రభుత్వ పెద్దల ఇష్టాలకనుగుణంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి, ప్రతి నెలా ఐటీ కట్టమని ఆర్థిక శాఖ సెక్రటరీల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందితే తప్ప ట్రెజరీ డైరెక్టర్‌ ఆ పనిచేయలేరు. అయితే బాధ్యులైన అందరినీ వదిలేసి, డ్యూటీ సక్రమంగా చేసిన డీడీవోలకు పెనాల్టీ విధిస్తానంటూ తాజా లేఖలో ఐటీశాఖ పేర్కొనడం గమనార్హం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0