We will prepare an alternative to CPS
సీపీఎస్కు ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తాం
- పాత పెన్షన్ ఇవ్వలేం
- వచ్చే నెల నుంచి ఆర్టీసీ సిబ్బందికి కొత్త జీతాలు
- త్వరలో ఉపాధ్యాయ నియామకాలు: బొత్స
- సీపీఎస్ రద్దు చేసే వరకు పోరు: ఏపీజీఈఏ
ప్రస్తుత పరిస్థితిలో పాత పింఛన్ విధానాన్ని అమలు చేయటం సాధ్యం కాదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన మాట నిజమేనన్నారు. ప్రత్యామ్నాయ పథకానికి రూపకల్పన చేస్తున్నాసమని, రెండు నెలల్లో ఒక కొలిక్కి రావచ్చని, ఆ తర్వాతే ప్రకటిస్తామని అన్నారు. శనివారం విజయనగరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) నాలుగో వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని సీపీఎస్ విధానంలో మార్పులు తీసుకువచ్చి ఎవరికీ ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘వచ్చే మూడు నెలల్లో విద్యా శాఖలో ప్రమోషన్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే ఎంఈవోల నియామకం చేపట్టాం. పీఆర్సీతో కలిపి జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్దిరోజుల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం. ఆర్టీసీ సిబ్బందికి వచ్చే నెల నుంచి కొత్త జీతాలు అమల్లోకి వస్తాయి. రాష్ట్ర విభజన సందర్భంగా 2 వేల మంది ఉద్యోగుల విషయంలో సమస్య ఏర్పడింది.
దీనిపై అనేకసార్లు చర్చలు జరిపాం
కేంద్రం ఆదేశించిన విధంగా వారికి ఓపీఎస్ అమలు చేయాలా లేక సీపీఎస్సా అన్నది ఆర్థిక శాఖ ద్వారా కూడా చర్చ జరిగింది. దీనిపై నెలాఖరుకు స్పష్టత రానుంది’’ అని బొత్స అన్నారు. ఈ సమావేశంలో మొదట ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్. సూర్యనారాయణ, కార్యదర్శి జి.ఆస్కారరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకుని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
0 Response to "We will prepare an alternative to CPS"
Post a Comment