Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Railways

 Indian Railways : రైల్వే సరికొత్త టెక్నాలజీ  RAC ప్రయాణికులకు టిక్కెట్ను ఇలా కన్ఫామ్ చేస్తుంది !

Indian Railways

Indian Railways: చాలా మంది భారతీయులు దూర ప్రయాణాలకు వాడే రవాణా సాధనం రైల్వేనే. ఇక పండగ సమయాల్లో అయితే రైళ్లు కిక్కిరిసిమంటుంటాయి. ఆ సమయంలో చాలా మందికి కన్‌ఫామ్ టిక్కెట్లు దొరకవు. కన్‌ఫామ్ టిక్కెట్లు పొందడంలో ప్రయాణికులు ఇబ్బుందులు పడుతూ ఉంటారు. చివరి క్షణంలో ఒకే బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు కేటాయిస్తూ ఉంటుంది భారతీయ రైల్వే. అయితే ఈ వెయిట్ లిస్టు లేదా ఆర్ఏసీ టిక్కెట్లను కన్‌ఫామ్ చేసేందుకు భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీని వాడటం ప్రారంభించింది. హ్యాండ్-హెల్డ్ టర్మినల్స్(HHTs)టెక్నాలజీ ద్వారా భారతీయ రైల్వే గత నాలుగు నెలల్లో రోజుకు 7 వేల మంది అన్‌కన్‌ఫామ్డ్ టిక్కెట్ హోల్డర్లకు సీట్లను కన్‌ఫామ్ చేసింది. రియల్ టైమ్ బేసిస్‌లోనే ఈ టిక్కెట్లను కన్‌ఫామ్ చేసింది.

ఎవరైనా ప్యాసెంజర్ తన రిజర్వు టిక్కెట్‌ను చివరి క్షణంలో రద్దు చేసుకున్నా లేదా రాలేకపోయినా.. ఆ ఖాళీ సీటు వివరాలు హెచ్‌హెచ్‌టీ డివైజ్‌లో కనిపిస్తాయి. వెయిట్ లిస్టెడ్ ప్యాసెంజర్ లేదా ఆర్ఏసీ ప్యాసెంజర్‌కి ఆ సీటు బుక్ అయ్యేలా ట్రైన్ టిక్కెట్ ఎగ్జామినర్‌కి ఇది అనుమతిస్తోంది. అలా టిక్కెట్ కన్‌ఫామ్ కాని చాలా మందికి ఈ టెక్నాలజీ ద్వారా సీటు బుక్ చేస్తుంది. హెచ్‌హెచ్‌టీ(HHT) డివైజ్ ఐప్యాడ్ సైజులో ఉంటుంది. ఇది ప్యాసెంజర్ ఛార్ట్‌లతో ప్రీలోడ్ అయి ఉంటుంది. అంతకుముందు లాగా పేపర్ ఛార్ట్‌ల ద్వారా కాకుండా.. టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ నేరుగా ఈ టివైజ్ ద్వారానే రియల్ టైమ్ అప్‌డేట్లను చెక్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ సెంట్రల్ సర్వర్‌కి అనుసంధానమై ఉంటుంది.

హెచ్‌హెచ్‌టీ ద్వారా రియల్ టైమ్ బేసిస్‌లో ఏమైనా బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయా? అనే విషయాన్ని ప్రయాణికులు టీటీఈ దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఇది రైళ్లలో సీటు కేటాయింపులో పారదర్శకతను కూడా తీసుకొస్తుంది. నాలుగు నెలల క్రితం భారతీయ రైల్వే ఈ హెచ్‌హెచ్‌టీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి రోజూ సుమారు 1,390 ట్రైన్లలోని టీటీఈలు సుమారు 10,745 హెచ్‌హెచ్‌టీ డివైజ్‌ను వాడారు. వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లో, ఈ హెచ్‌హెచ్‌టీ డివైజ్‌లు అన్ని దూర ప్రయాణాల రైళ్లకు అందుబాటులోకి వస్తాయి.


హెచ్‌హెచ్‌టీని ప్రయాణికుల నుంచి అదనపు ఫీజులను, జరిమానాలను, ఇతర ఛార్జీలను వసూలు చేసేందుకు కూడా వాడుకోవచ్చు. డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా ఈ ఛార్జీలను సేకరించవచ్చు. దీన్ని భవిష్యత్‌లో రశీదులు జారీ చేసేందుకు కూడా వాడొచ్చు. రియల్ టైమ్ బేసిస్‌లో ఆన్‌లైన్‌గా పర్యవేక్షించడం ద్వారా ఖాళీ అయిన బెర్త్‌ల వివరాలను పొందడం, వెయిట్ లిస్టెడ్ ప్యాసెంజర్లకు టిక్కెట్ల జారీ, సీట్ల జారీలో అక్రమాలను తగ్గించడం వంటి వాటిని భారతీయ రైల్వే చేపట్టనుంది.

మహిళలకు ప్రత్యేక సీట్లు..

బస్సుల్లో, మెట్రోల్లో మాదిరి.. రైళ్లలో కూడా మహిళలకు ప్రత్యేక సీట్లను కేటాయించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైళ్లలో మహిళలు సౌకర్యవంతంగా వారికి ప్రత్యేక బెర్త్‌లతో పాటు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని మంత్రి చెప్పారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Railways"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0