A Survey of Pedagogy
బోధనా విధానంపై సర్వే
- టీచర్ల నుంచి అభిప్రాయాల సేకరణ
- ''సాల్ట్' పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు.
ఉపాధ్యాయులకు వృత్తిపరంగా నైపుణ్యాలను మరింత పెంపొందించే ప్రణాళికలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. అనంతరం శిక్షణ ప్రాజెక్టును అమల్లోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యసన, పరివర్తన సహాయక పథకం (సాల్ట్) అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి జిల్లాల అధికారులకు సర్క్యులర్ ద్వారా సూచనలు చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి అవసరాలను అంచనా వేయడానికి వారి అవసరాల ఆధారంగా తగిన శిక్షణ అందించేందుకు ఆన్లైన్ సర్వే నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు. పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరె క్టర్లు, డీఈవోలకు సంబంధిత సమాచారం పంపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశా లల ఉపాధ్యాయులంతా విధిగా ఆన్లైన్ సర్వేను పూరించాలన్నారు. బుధవారం నుంచి ఈ సర్వే ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభమైందని, ఇది అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులంతా వారి సబ్జెక్టులతో సంబంధం లేకుండా 1నుంచి 10 తరగ తులు బోధించేలా అవసరమైన సూచనలు జారీ చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులంతా ఆన్ రైన్ సర్వే పూరించడం తప్పనిసరి అని పేర్కొ న్నారు. హెచ్ఎంలంతా తమ పాఠశాలల్లోని ఉపా ధ్యాయులను నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తి చేసేలా చూడాలని కోరారు.
0 Response to "A Survey of Pedagogy"
Post a Comment