He gave up his salary of lakhs for the profession of a teacher.
టీచర్ ఉద్యోగంపై మమకారంతో లక్షల జీతాన్ని వదులుకుని టీచర్ వృత్తికి.
టీచర్ ఉద్యోగం అంటే అభిమానంతో లక్షల జీతాన్ని వదులుకుని విదేశాల్లో ఉంటున్న కొందరు ఇటీవల ఏపీకి తిరిగి వస్తున్నారు. ఇదిలావుంటే డీఎస్సీ-98లో అర్హత సాధించిన అభ్యర్థులకు కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే.
నియామక ప్రక్రియ ప్రారంభం కావడంతో విదేశాల్లో ఉన్నవారు సైతం ఉపాధ్యాయ ఉద్యోగం చేరడానికి స్వదేశానికి రావడం గమనార్హం. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో అక్కడ లక్షల్లో జీతం వదులుకుని వచ్చేస్తున్నారు. దుబాయ్లో ఉండే నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరికండ్రిగకు (ప్రస్తుతం తిరుపతి జిల్లా) చెందిన మునుస్వామి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చారు. మునుస్వామి 15 ఏళ్లుగా అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ నెలకు రూ.2.5 లక్షల జీతంతో స్థిరపడ్డారు.
అయితే, 1998 డీఎస్సీ అర్హుల జాబితాలో తన పేరు ఉండటం, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలన్న తన జీవితాశయం మేరకు.. రూ.లక్షల జీతాన్ని వదులుకుని ఇటీవల స్వదేశానికి చేరుకున్నారు. సర్టిఫికెట్లు పరిశీలిస్తున్న అధికారులు ఆయన వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమని, దీనికోసంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని మునుస్వామి తెలిపినట్లు అధికారులు చెప్పారు.
0 Response to "He gave up his salary of lakhs for the profession of a teacher."
Post a Comment