7th Pay Commission on travel allowance hike to central govt Employees
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. ట్రావెల్ అలవెన్స్ పెరిగింది.
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే డీఏను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ట్రావెల్ అలవెన్స్ ను కూడా పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ట్రావెలింగ్ కు సంబంధించిన అలవెన్స్ పెంచింది. దానిలో భాగంగా.. కేంద్ర ఉద్యోగులకు ఇప్పుడు తేజస్ రైలు, దురంతోలో ప్రయాణించినా, రాజధానిలో ప్రయాణించినా కూడా డీఏ వర్తిస్తుంది. ప్రస్తుతానిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఏ 38 శాతంగా ఉంది. దీంతో టీఏను కూడా పెంచింది కేంద్రం. సాధారణంగా అధికారిక పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రైలు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఆ పర్యటనలో భాగంగా తేజస్ రైలులో ప్రయాణించవచ్చు.
7th Pay Commission : అధికారిక ప్రయాణం కోసం రైలు ప్రయాణం చేయొచ్చు
ప్రైవేట్, ప్రీమియం క్లాస్ లో ప్రయాణించి టీఏను పొందొచ్చు. ట్రావెలింగ్ అలవెన్స్ కింది లేవల్ 1, 2 ఉద్యోగులకు రూ.1350, లేవల్ 3 నుంచి 8 వరకు రూ.3600, లేవల్ 9 నుంచి పైబడిన వాళ్లకు రూ.7200 డీఏ రానుంది. ఒకవేళ క్యాబినేట్ సెక్రటరీ స్థాయి అధికారులకు అయితే కారు ఉపయోగించుకుంటే నెలకు రూ.15,750 టీఏతో పాటు డీఏను ప్రభుత్వం చెల్లిస్తుంది. వీళ్లు కారును అధికారిక పర్యటన కోసం కారు లాంటి వాహనాలను ఉపయోగించుకుంటారు.
0 Response to "7th Pay Commission on travel allowance hike to central govt Employees"
Post a Comment