Maternity leave is a year
మాతృత్వ సెలవులు ఏడాది
- మహిళా ఉద్యోగులకు సిక్కిం ప్రభుత్వం వరాలు
- ఆయాలకు నెలకు రూ. 10వేల భృతి
- ఎక్కువ మందిని కంటే ఇంక్రిమెంట్లు
- సంతానలేమి బాధితులకు ఐవీఎఫ్ ఉచిత సేవలు
గ్యాంగ్టక్: పడిపోతున్న జనాభాను పెంచేందు కు సిక్కిం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రం లో సంతానోత్పత్తి రేటును వృద్ధి చేసేందుకు ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. మహిళా ఉద్యోగుల మాతృత్వపు సెలవులను ఏడాదికి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ వెల్లడించారు. అంతేకాకుండా మహిళా ఉద్యోగులు ప్రసవిస్తే ఏడాది పాటు చిన్నారుల బాగోగులన చూసు కునేందుకు ఇంటి వద్ద ఓ ఆయాను కూడ ప్రభుత్వమే నియమిస్తుందని తెలిపారు. ఆయా పోస్టుల కోసం 40 అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలను రిక్రూట్ చేయనున్నామన్నారు. వీరికి నెలకు రూ. 10వేల భృతిని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అనూహ్యంగా పడిపోతున్న దృష్ట్యా ప్రభుత్వ ఈ చర్యలు చేయనున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి వరాల జల్లులు అక్కడితోనే ఆగలేదు.. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను జన్మనిచ్చే మహిళా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వనున్నట్టు సీఎం ప్రేమ్ సింగ్ వెల్లడించారు. సాధారణ ప్రజలకు కూడా సీఎం వరాలు కురిపించారు. సాధారణ ప్రజలు కూడా ఎక్కువ మంది పిల్లలను కంటే ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన అన్నారు. మరోవైపు సంతాన లేమితో బాధపడుతున్న వారికోసం ప్రభుత్వమే ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. సిక్కిం రాష్ట్ర వ్యాప్తంగా వాటి ద్వారా సంతానం పొందిన దంపతులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటిం చారు. రాష్ట్రంలో ప్రస్తుత జనాభా 7 లక్షల కంటే తక్కువగానే ఉంది. సంతానోత్పత్తి రేటు 1.1 శాతంగా ఉంది. పడిపోతున్న జనన రేటును పెంచే దిశగా ప్రభుత్వం ఇలాంటి జల్లులను కురిపిస్తుంది.
0 Response to "Maternity leave is a year"
Post a Comment