Can we answer these questions in Ramayana? How many can we say?
రామాయణంలోని ఈ ప్రశ్నలకు జవాబులు మనం చెప్పగలమా? ఎన్ని చెప్పగలము?
హిందువులకు రాముడు వెంట నడిచే దైవం.. జననం, కళ్యాణం, పట్టాభిషేకం ఈ శుభ సంఘటనలు చైత్ర శుద్ధ నవమి రోజున జరగడంతో.. ప్రజలు నవమి రోజున సీతారాముల కళ్యాణం ఉత్సవాన్నినిర్వహిస్తారు. హిందువుల పవిత్ర గ్రంధాల్లో ఒకటి రామాయణం. ప్రజలు ఎలా నడుచుకోవాలో తెలియజేసేది రామాయణం అని పెద్దల నమ్మకం. నేడు ఆ మహనీయుడిని జన్మ దినం శ్రీ రామ నవమి సందర్భంగా ఎంతవరకూ నేటి జనరేషన్ కు రామాయణం గురించి తెలుసుకుందాం.. రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు.. వాటికీ సమాధానం.. మీ రామాయణం పరిజ్ఞానం పరీక్షించుకోండి.. తెలియని విషయాలను తెలుసుకోగలరు.
శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
వాల్మీకి.
శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
24,000.
వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
నారదుడు.
రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
తమసా నది.
శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
కుశలవులు.
అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
సరయూ నది.
అయోధ్య ఏ దేశానికి రాజధాని?
కోసల రాజ్యం.
దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
సుమంత్రుడు.
దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
కౌసల్య, సుమిత్ర, కైకేయి.
సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
పుత్రకామేష్ఠి.
యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
కౌసల్య కుమారుని పేరేమిటి?
శ్రీరాముడు.
భరతుని తల్లి పేరేమిటి?
కైకేయి.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి?
లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.
బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
జాంబవంతుడు.
వాలి ఎవరి అంశతో జన్మించెను?
దేవేంద్రుడు.
వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
హనుమంతుడు.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
వసిష్ఠుడు.
విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
16 సంవత్సరములు.
విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
మారీచ, సుబాహులు.
రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
బల-అతిబల.
విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
సిద్ధాశ్రమం.
తాటక భర్త పేరేమిటి?
సుందుడు.
తాటకను శపించిన మహర్షి ఎవరు?
అగస్త్యుడు.
గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
భగీరథుడు.
గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
జహ్ను మహర్షి చేత త్రాగి..కర్ణంతో విడువబడుతో జాహ్నవి పేరు
అహల్య భర్త ఎవరు?
గౌతమ మహర్షి.
జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
శతానందుడు.
సీత జనకుడికి ఎట్లు దొరికెను
పొలం దున్నుతుంటే నాగలి చాలున జనకునికి దొరికెను.
శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
దేవరాతుడు.
శివధనుస్సును తయారు చేసినదెవరు?
విశ్వకర్మ.
భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
మాండవి, శృతకీర్తి.
లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
జనకుడు.
జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
కుశధ్వజుడు.
పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
వైష్ణవ ధనుస్సు.
భరతుని మేనమామ పేరు ఏమిటి?
యుధాజిత్తు.
దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
మంధర.
కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
గిరివ్రజపురం, మేనమామ యింట.
రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
శృంగిబేరపురం.
సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
గారచెట్టు.
శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
భరద్వాజ ముని.
పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
మాల్యవతీ.
దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎట్లు భద్రపరిచారు?
తైలద్రోణములో.
శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
జాబాలి.
భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
నందిగ్రామము.
అత్రిమహాముని భార్య ఎవరు?
అనసూయ.
దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
విరాధుడు.
పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
అగస్త్యుడు.
పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
గోదావరి.
లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
శూర్ఫణఖ.
ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
జనస్థానము.
సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
మారీచుడు.
సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
బంగారులేడి.
సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
జటాయువు.
సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
దక్షిణపు దిక్కు.
సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
కబంధుని.
సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
మతంగ వనం, పంపానదీ.
సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
ఋష్యమూక పర్వతం.
రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
హనుమంతుడు.
రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
అగ్ని సాక్షిగా.
రాముడు తన బాణములు దేనితో తయారు
చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
కుమారస్వామి జన్మించిన వనములోని బంగారు కాండములు.
సుగ్రీవుని భార్య పేరు?
రుమ.
వాలి భార్యపేరు?
తార.
వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
కిష్కింధ.
వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
మాయావి.
సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
ప్రసవణగిరి.
సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
మాసం (ఒక నెల).
హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
పుంజికస్థల.
హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరి కోసం ఆగుతుంది?
కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
స్వయంగా తన భవనమునే యిచ్చెను.
0 Response to "Can we answer these questions in Ramayana? How many can we say?"
Post a Comment