Good news for AP Govt employees..Key announcement on plots.
In Jagananna Smart Townships 10% plots will be reserved for Govt. employees with 20% rebate on sale price. you are requested to furnish details through the link
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..ప్లాట్లపై కీలక ప్రకటన.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ శనివారం కీలక ప్రకటన చేసింది.
ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఈ ప్లాట్లు కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. లే అవుట్ వేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సరైన స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జగనన్న లే అవుట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను, 20 శాతం రాయితీని ఇస్తున్నట్లు సిఆర్డిఏ కమిషనర్ గతంలోనే తెలిపారు. అయితే ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అయినా, జగనన్న లే అవుట్ లో ప్లాట్ ను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పధకం లో భాగంగా ఫ్లాట్స్ కోసం అప్లై చేసుకోవాలనే వారు క్రింది లింకును క్లిక్ చేసి మీ వివరాలను సబ్మిట్ చేయాలి.
https://forms.gle/c8vh4E8c5gLVkZm16
ఇంకా పూర్తి సమాచారం కొరకు క్రింద చూడగలరు
Jagananna Town Ship డీటెయిల్స్
0 Response to "Good news for AP Govt employees..Key announcement on plots."
Post a Comment