AP Cabinet meeting concluded
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మొత్తం 63 అంశాలకు ఆమోదము.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నేడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో 12వ పీఆర్సీ నియామకానికి.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- మొత్తం 63 అంశాలకు ఆమోదముద్ర
- కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు,
- ఈ ఏడాది అమ్మ ఒడి పథకం అమలుకు,
- ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి,
జగనన్న ఆణిముత్యాలు పథకం అమలు.. ఇంకా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది
12వ పీఆర్సీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి వర్గం అంగీకారం తెలిపింది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Key Decisions in AP Cabinet Meeting: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
జగనన్న అమ్మ ఒడి పథకం అమలును జూన్ 28 తేదీకి వాయిదా వేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు 6వేల 888కోట్ల రూపాయలను వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం 445 కోట్ల రుణాల కోసం ఏపీ ఎఫ్ఎస్ఎల్కు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదించింది.మరోవైపు రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలలకు 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్కు చెందిన 28 ఎకరాల భూమినీ లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది. కేబినెట్ మీటింగ్ అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వెల్లడించనున్నారు.
0 Response to "AP Cabinet meeting concluded"
Post a Comment