Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ap Cabinet Meet

నేడు ఏపీ కేబినెట్ భేటీ.ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్యూస్!

Ap Cabinet Meet

 Ap Cabinet Meet Today ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నేడు సమావేశంకానుంది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి అంటున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం జగన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి వివాహానికి హాజరవుతారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశంకానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమూల్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారన్నారు. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై మంచి నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు.

పాత పింఛను పథకానికి సమానంగా ఉండే పథకాన్ని తీసుకొస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వచ్చే 50% పింఛనుకు తగ్గకుండా.. అలాగే డీఏ క్రమంగా పెరిగేలా ఆలోచన చేస్తున్నారని వివరించారు. అయితే పీఆర్సీ వర్తించదని.. కొత్త పథకాన్ని ఆయా సంఘాలు ఆహ్వానిస్తాయని అనుకుంటున్నాను అన్నారు. ఉద్యోగ సంఘాలు వాటి గొప్పతనాన్ని ప్రచారం చేసుకునేందుకే ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తోందని.. సంఘాలు మాత్రం తాము ఆందోళన చేయడం వల్లే ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరిస్తోందని చెప్పుకొంటున్నాయన్నారు.

మరోవైపు ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు వెళతారు. మలికిపురం చేరుకుని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహానికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మరోవైపు పోలీసులు తనపై నమోదు చేసిన కేసుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నానని.. అందుకే తనను వేధించడం కోసం తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. వాణిజ్య పన్నులశాఖ విజయవాడ 1వ డివిజన్‌ నిఘా విభాగంతో ఎటాచ్‌ అయి తాను పనిచేయలేదని తెలిపారు.

తనకు ఆ విభాగానికి సంబంధించిన అకౌంట్‌లు, పుస్తకాలపై నియంత్రణ లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జాప్యం కావడంతో.. తాను గతంలో గవర్నర్‌ను కలిసి వినతి సమర్పించాను అన్నారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వం తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చిందన్నారు. హైకోర్టును ఆశ్రయించి దాని అమలును నిలుపుదల చేయించానని.. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదన్నారు. తనకు హార్ట్ సర్జరీ జరిగిందని.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. అందుకే తనను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు తిరుగుతున్నందున ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారని సూర్యనారాయణపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనతో సహా మరో నలుగురు ఉద్యోగులపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నలుగురు ఉద్యోగులను అరెస్ట్‌ చేయగా.. ఐదో నిందితుడిగా ఉన్న సూర్యనారాయణ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ap Cabinet Meet"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0