Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Coromandel express accident

Coromandel express accident :కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారో వివరణ.

Coromandel express accident

కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఈ ప్రమాదంలో 233 మంది దుర్మరణం చెందారు. 900 మందికి గాయాలయ్యాయి.తొలుత బెంగళూర్ - హావ్ డా బోగీలు పట్టాలు తప్పగా వాటిని కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ట్రాక్ పై పడిన కోరమండల్ బోగీలను గూడ్స్ ట్రైన్ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. 'నిద్ర రావడంతో పడుకున్నా.. రైలు ప్రమాదానికి గురైనప్పుడు మెలకువ వచ్చింది. మాది రిజర్వేషన్ బోగీ అయినా జనరల్ బోగీలానే ఉంది. పది, పదిహేను మంది నాపై ఒక్కసారిగా పడ్డారు. నేను అందరికంటే కింద ఉండిపోయాను. నా చేతికి, మెడపై గాయమైంది. నేను ట్రైన్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొందరికి కాళ్లు లేకపోవడం, కొందరికి చేతులు లేకపోవడం, కొందరి ముఖంపై దెబ్బలు చూశాను. తర్వాత నేను తిరిగి వచ్చి ఇక్కడే కూర్చున్నాను.' అని తెలిపాడు.

కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : రక్తదానం చేసేందుకు బారులు తీరిన యువత.

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణ మృదంగం మోగించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా 900 మందికి గాయాలయ్యాయి.

అయితే వీరిలో చాలా మంది బోగీల్లో ఇరుక్కుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాపదినంగా ప్రకటించింది. కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్‌లో గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు యువత భనగా, సోరో ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే యువత రక్త దానం చేసేందుకు తరలిరావడంతో నెటిజన్లు వారి గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆర్మీ కల్నల్ ఎస్కే దత్తా మాట్లాడుతూ.. ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. మరికొంత మంది ఆర్మీ సిబ్బందిని కోల్ కతా నుంచి రప్పిస్తున్నామన్నారు. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 200 అంబులెన్సులు, 45 మొబైల్ హెల్త్ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయన్నారు. 50 మంది డాక్టర్లు సహాయక చర్యల్లో భాగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Coromandel express accident"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0