Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 అంతా రామమయం.. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠకు వేళాయె



రామభక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రామజన్మభూమి రామనామ స్మరణతో పులకించే శుభ వేళ ఎట్టకేలకు విచ్చేసింది.

సోమవారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అభిజిత్‌ లగ్నంలో అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈసందర్భంగా అయోధ్యా నగరం రామనామస్మరణతో మార్మోగనుంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత 12.55 గంటలకు హెలికాప్టర్‌తో అయోధ్య రామమందిరంపై పూలవర్షం కురిపిస్తారు. దాదాపు 800 మంది కార్మికులు అయోధ్య రామమందిరాన్ని, అయోధ్య నగరాన్ని పుష్పాలతో అలంకరించారు. ఇందుకోసం దాదాపు 1100 టన్నుల పూలను వాడారు. ప్రధాని మోడీ అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి ఆరు కిలోమీటర్లు రోడ్డుమార్గం మీదుగా ప్రయాణించి రాముడి ఆలయానికి చేరుకుంటారు. ఈ మార్గాన్ని కూడా బంతిపూలతో అలంకరించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.


పాస్ ఉన్న వాహనాలకే ఎంట్రీ


ఈ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యా నగరంవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ఏటీఎస్‌ కమాండోలు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గట్టి పహారా కాస్తున్నారు. ఫైజాబాద్ నుంచి అయోధ్యకు వచ్చే ప్రధాన రహదారిపై భద్రతా దళాలు బారికేడ్లను ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచి పాస్ ఉన్న వాహనాలనే అయోధ్య వైపునకు అనుమతిస్తున్నారు. దాదాపు 30 వేల మంది పోలీసులను అయోధ్యలో భద్రతకు మోహరించినట్లు యూపీ పోలీసు అధికారులు ప్రకటించారు. 10వేల సీసీ కెమెరాలు అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్య దారుల్లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) కమాండోలు కవాతు నిర్వహిస్తున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ కోసం ఆహ్వానాలు అందుకున్న ముఖ్య అతిథులు సోమవారం ఉదయం 10 గంటలకల్లా ఆలయానికి చేరుకుంటారు.


10 లక్షల దీపాలతో అయోధ్య అలంకరణ


బాలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని అయోధ్య రామమందిరాన్ని సోమవారం సాయంత్రం 10 లక్షల దీపాలతో అలంకరించనున్నారు. ఈవిషయాన్ని రామజన్మభూమి ట్రస్టు వెల్లడించింది. రామాలయం, రామ్‌కీ పైదీ, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చవానీ, ఇతర ప్రముఖ ప్రదేశాలతో సహా ఏకంగా 100 ఆలయాల్లో ఈ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపింది. దీనికోసం మట్టి ప్రమిదలను ఉపయోగించనున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం వేళ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార కార్యాలయాల్లో దీపాలను వెలించాలని ప్రధాని మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత ఏడేళ్ల నుంచి అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తోంది.

నేడు జరిగేది బాలరాముడి ప్రతిష్ఠ!

భూతలం వరకే ఆలయ నిర్మాణం పూర్తి

ఆలయ ట్రస్టు చైర్మన్‌ నృపేన్‌ మిశ్రా

రామాలయ నిర్మాణం పూర్తికాకముందే ప్రాణ ప్రతిష్ఠ చేయడాన్ని, గర్భగుడిలోకి ప్రధాని మోదీని అనుమతించి..

తమకు మాత్రం వెలుపల ఆసనాలు ఏర్పాటు చేయడాన్ని నలుగురు శంకరాచార్యలు వ్యతిరేకించడంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చైర్మన్‌ నృపేన్‌ మిశ్రా స్పందించారు. వారు సనాతన ధర్మాచరణ పర్యవేక్షకులని పేర్కొన్నారు. 'వారు ధర్మగురువులు. నేను సామాన్యుడిని..

అయితే జాతికి నేనో విషయం చెప్పదలిచాను. ఆలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌ భూతలంలో బాలరాముడిని ప్రతిష్ఠ చేస్తున్నామని ప్రకటించాం. ఇందులో గర్భ గుడి, ఐదు మండపాలుంటాయి. దీనివరకు నిర్మాణ పూర్తయింది.

మొదటి అంతస్థు ఇంకా పూర్తి కావలసి ఉంది. అందులో రామ్‌దర్బార్‌ ఉంటుంది. రాజారాముడు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా దర్శనమిస్తాడు. రెండో అంతస్థులో ధ్యానం, ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి' అని వివరించారు.

మొత్తం ఆలయం ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాబోమన్న నలుగురు శంకరాచార్యలను, ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆధ్యాత్మికవేత్త జగద్గురు స్వామి రామభద్రాచార్య మహరాజ్‌ ''వినాశకాలే విపరీత బుద్ధి'' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అహం వీడి వేడుకలకు హాజరు కావాలని హితవు పలికారు.

1000 సంవత్సరాల వరకు రామ మందిరం ఫదిలం.. ఎలా సాధ్యమంటే

రామ మందిరప్రారంభో త్సవానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో గత 500 ఏళ్ల రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. రామ మందిర నిర్మాణం భక్తి , గౌరవం దృష్ట్యా మాత్రమే కాకుండా అయోధ్య అభివృద్ధి కూడా చాలా ముఖ్యమైనది.

రామాలయంలోని ప్రతి భాగాన్ని పూర్తిగా రాతితో చెక్కడం కోసం ప్రత్యేక ప్రయత్నం జరిగింది. కనీసం రాబోయే 1000 సంవత్సరాల వరకు ఎటువంటి నష్టం జరగకుండా రామ మందిరాన్ని పకడ్బందీగా నిర్మించారు. ఆలయం మాత్రమే కాదు, రామ మందిరం తలుపులు కూడా రాబోయే 1000 సంవత్సరాల వరకు బలంగా ఉంటాయి. రామ మందిరానికి తలుపులు తయారు చేసే తెలంగాణ సంస్థ కూడా ఇదే వాదన చేసింది.

రామాలయానికి తలుపుల తయారీ బాధ్యతను తెలంగాణ సంస్థ అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్‌కు అప్పగించారు. కంపెనీ మేనేజింగ్ పార్ట్‌నర్ శరత్‌బాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామాలయంలో ఏర్పాటు చేయాల్సిన తలుపులు, దాని విశేషాలను వెల్లడించారు. రాబోయే 1000 సంవత్సరాల పాటు రామ మందిరం తలుపులను పూర్తిగా సురక్షితంగా ఉంచేందుకు తన కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా ఆయన చెప్పారు.

రామాలయానికి తలుపులు తయారు చేసే బాధ్యతను అప్పగించిన సంస్థ, ప్రాథమికంగా కలప దిగుమతి, ఎగుమతితో వ్యవహరిస్తుంది. గత 5 సంవత్సరాలుగా, కంపెనీ దేవాలయాలకు తలుపుల తయారీ పనులను ప్రారంభించింది. ఈ సంస్థ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలకు తలుపులు డిజైన్ చేసింది. ఈ కంపెనీ మూడు తరాలుగా కలప వ్యాపారం చేస్తోంది.

మరో 200 తలుపులు అమర్చనున్నారు.. 

కంపెనీ మేనేజింగ్ పార్టనర్ శరత్‌బాబు మీడియాతో తన సంభాషణలో మాట్లాడుతూ, అయోధ్యలోని రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇప్పటివరకు మొత్తం 18 తలుపులు అమర్చినట్లు చెప్పారు. ఈ తలుపులు ఆలయ గర్భగుడి, మంటపం ఇతర ప్రదేశాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 18 తలుపులలో 14 తలుపులకు బంగారు పూత పూయబడింది.

మిగిలిన 4 తలుపులు చెక్కతో తయారు చేయబడ్డాయి. ప్రాకారాలపై 9 తలుపులు ఏర్పాటు చేయనున్నారు, వీటిని సిద్ధం చేసే పని ఇంకా కొనసాగుతోంది. ప్రధాన ఆలయంలో మొత్తం 127 తలుపులు ఏర్పాటు చేయనున్నారు. రాబోయే 1-2 సంవత్సరాలలో, ఆలయం పూర్తిగా సిద్ధమయ్యే వరకు, రామ మందిరంలో మరో 200-300 తలుపులు అమర్చనున్నారు.

సంపూర్ణ స్వావలంబన భారతదేశానికి రామ మందిరం ఒక ఉదాహరణ. ఆలయంలో ప్రతిష్టించిన తలుపులు, తలుపుల చెక్క, వాటిని సిద్ధం చేయడానికి ఉపయోగించే యంత్రాలు, కూలీల వరకు, ప్రతిదీ భారతదేశంలో మాత్రమే తయారు చేశారు. రామ మందిరంలో ఎలాంటి విదేశీ వస్తువులు ఉపయోగించలేదు. రామమందిరంలో మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్న టేకు కలపతో తలుపులు, డోర్ ఫ్రేములు తయారు చేస్తున్నారు.

ఏ ప్రమాణాల ప్రకారం కలప ఎంపిక చేశారు..?

రామ మందిరం తలుపులు కనీసం 1000 ఏళ్లపాటు భద్రంగా ఉండేలా చూడాలని శరత్‌బాబు చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, తలుపుల తయారీకి కలపను కూడా ఎంపిక చేశారు. డెహ్రాడూన్ అటవీ శాఖ రామ మందిరం తలుపుల కోసం కలపను ఎంపిక చేయడంలో మాకు సహాయం చేసింది. మాకు చెక్కల వ్యాపారంతో చాలా కాలంగా అనుబంధం ఉందని అన్నారు.

అందువల్ల, ఉత్తమమైన కలపను ఎంచుకోవడం మాకు సులభం అయింది. గుడి తలుపులపై కూడా నాగర్ శైలి, ఆలయాన్ని నిర్మించిన తీరు ఆధారంగా డిజైన్లన్నీ సిద్ధం చేశామని శరత్‌బాబు చెబుతున్నారు. తలుపులు ఉల్లాసమైన ఏనుగులు, తామర పువ్వులు, వివిధ ఇతర పుష్పాలు, ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించడానికి భగవంతుడిని ఆహ్వానించే వాహనాలతో చెక్కబడ్డాయి.

1000 సంవత్సరాల వరకు తలుపులు ఎలా సురక్షితంగా ఉంటాయి?

రామాలయానికి తలుపులు వేయడానికి, 100-200 చెట్లలో 10 లేదా 20 ట్రంక్లను మాత్రమే ఎంపిక చేశారు.ఇవి మా ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉండే ఏకైక కాండాలు. తలుపులు తయారు చేసేందుకు 80-100 ఏళ్ల టేకు చెట్లను ఎంపిక చేశారు. అంతకంటే పాత చెట్లను కూడా వెతికినా ఆచూకీ లభించలేదు.

80-100 సంవత్సరాల వయస్సు గల చెట్లు ఏవి కనుగొనబడినా, వాటిలో కొంత భాగాన్ని మాత్రమే అధిక నాణ్యత కలిగిన తలుపులు లేదా ఫ్రేమ్‌లను తయారు చేయడానికి ఉపయోగించారు.

తలుపుల తయారీలో ప్రతి చెట్టు లేదా ట్రంక్ నుండి 20శాతం అధిక నాణ్యత కలప మాత్రమే ఉపయోగించారు. ప్రతి తలుపును సిద్ధం చేస్తున్నప్పుడు, ఇది 100శాతం లోపాలు లేకుండా, 1000 సంవత్సరాల పాటు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 60 మంది కళాకారుల బృందం రామమందిరానికి తలుపులు వేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కళాకారులందరూ తమిళనాడు, మహాబలిపురం, కన్యాకుమారి నుంచి వచ్చారు. వీరంతా అనేక తరాలుగా చెక్క పని చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0