AP Grama/Ward sachivalaya Exam results
AP Grama/Ward sachivalaya Exam results
ప్రధానాంశాలు:
ప్రధానాంశాలు:
- పరీక్షలకు హాజరైన 19.74 లక్షల మంది అభ్యర్థులు
- అధికారిక వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో
ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు గురువారం (సెప్టెంబరు 19) విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించిన 14 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష పూర్తయిన పదిరోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా 788 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభంకానున్న మొత్తం 788 సచివాలయాల్లో.. మండలానికి ఒకటి చొప్పున 678 పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఒక్కో వార్డు చొప్పున 110 సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి.
i need link for uploading my certificates
ReplyDelete