Flexibility for government employees
ప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు
సర్కారు సానుకూల నిర్ణయం
సడలిన నిబంధనలు
రెండేళ్ళ సర్వీసుకే ప్రమోషన్ల
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో నిబంధనలను సడలించింది . ఈ నేపధ్యంలో సోమవారం జిఓ నెంబర్ 175ను జారీ చేసింది . వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతిని పొందాలంటే కనీసం ఐదేళ్ళ సర్వీస్ ఉండాలని , గతంలో 627 జిఓలో పేర్కొనడం జరిగింది . 1983 డిసెంబర్ 21 నుండి 2014 మే నెల 30వ తేదీ వరకు ఐదేళ్ళ కనీస సర్వీసు ఉండాలని నిర్దేశించింది . అంతేకాకుండా జిఓ నెంబర్ 230 ప్రకారం 2014 మే నెల 31 నుండి ఇప్పటి దాకా మూడేళ్ళ కనీస సర్వీసు ఉంటేనే ప్రమోషన్లు ఇస్తున్నారు . దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేఖత ఏర్పడింది . కనీస సర్వీసును సడలించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు . ఫలితంగా ఐదేళ్ళ కనీస సర్వీసును రెండేళ్ళకు తగ్గించడంతో ఉద్యోగులకు ఊరట లభించింది . 627 జిఓను సవరిస్తూ తాజాగా 175వ నెంబర్ జిఓను విడుదల చేసింది . రాష్ట్రంలో ఎదురవుతున్న పాలనా పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పదోన్నత నిబంధనలు సడలింపు చేయాలని ఉద్యోగులు కోరారు . ఇటీవల జరిగిన వరుస సమావేశాల నేపధ్యంలో ఈ సమస్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళింది . అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు . ఈ పరిణామాల నేపద్యంలో తాజాగా జారీ చేసిన ఉత్తర్వులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించనున్నాయి . ఇందుకోసమే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్హక్ రూల్స్ ను కూడా జారీ చేసింది . రెండేళ్ళకే ప్రమోషన్ వెసులుబాటు నిర్ణయంతో పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వానికి కూడా పరిపాలనా పరమైన అంశాలపై ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఏర్పడ్డాయి . వివిధ ప్రాంతాల్లో తమ నివాసాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా కొత్త ప్రభుత్వ నిర్ణయం ఉపశమనాన్ని కలిగిస్తుంది .
సర్కారు సానుకూల నిర్ణయం
సడలిన నిబంధనలు
రెండేళ్ళ సర్వీసుకే ప్రమోషన్ల
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో నిబంధనలను సడలించింది . ఈ నేపధ్యంలో సోమవారం జిఓ నెంబర్ 175ను జారీ చేసింది . వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతిని పొందాలంటే కనీసం ఐదేళ్ళ సర్వీస్ ఉండాలని , గతంలో 627 జిఓలో పేర్కొనడం జరిగింది . 1983 డిసెంబర్ 21 నుండి 2014 మే నెల 30వ తేదీ వరకు ఐదేళ్ళ కనీస సర్వీసు ఉండాలని నిర్దేశించింది . అంతేకాకుండా జిఓ నెంబర్ 230 ప్రకారం 2014 మే నెల 31 నుండి ఇప్పటి దాకా మూడేళ్ళ కనీస సర్వీసు ఉంటేనే ప్రమోషన్లు ఇస్తున్నారు . దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేఖత ఏర్పడింది . కనీస సర్వీసును సడలించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు . ఫలితంగా ఐదేళ్ళ కనీస సర్వీసును రెండేళ్ళకు తగ్గించడంతో ఉద్యోగులకు ఊరట లభించింది . 627 జిఓను సవరిస్తూ తాజాగా 175వ నెంబర్ జిఓను విడుదల చేసింది . రాష్ట్రంలో ఎదురవుతున్న పాలనా పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పదోన్నత నిబంధనలు సడలింపు చేయాలని ఉద్యోగులు కోరారు . ఇటీవల జరిగిన వరుస సమావేశాల నేపధ్యంలో ఈ సమస్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళింది . అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు . ఈ పరిణామాల నేపద్యంలో తాజాగా జారీ చేసిన ఉత్తర్వులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించనున్నాయి . ఇందుకోసమే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్హక్ రూల్స్ ను కూడా జారీ చేసింది . రెండేళ్ళకే ప్రమోషన్ వెసులుబాటు నిర్ణయంతో పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వానికి కూడా పరిపాలనా పరమైన అంశాలపై ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఏర్పడ్డాయి . వివిధ ప్రాంతాల్లో తమ నివాసాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా కొత్త ప్రభుత్వ నిర్ణయం ఉపశమనాన్ని కలిగిస్తుంది .
0 Response to "Flexibility for government employees"
Post a Comment