All the retired employees are here! To further clarify, GAD is another G.O
రిటైర్డ్ ఉద్యోగులంతా ఇంటికే!
మరింత స్పష్టతనిస్తూ జీఏడీ మరో జీవో
పాత ప్రభుత్వం నియమించినా, కొత్త ప్రభుత్వం వచ్చాక ఉద్యోగం పొడిగింపునకు అనుమతి పొందినా సరే రిటైర్డ్ ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగించాల్సిందేనని మరింత స్పష్టతనిస్తూ గురువారం సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) పొటిలికల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వశాఖల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ప్రభుత్వ రిటైర్డ్ మధ్యస్థాయి అధికారుల తొలగింపు వ్యవహారంపై వేర్వేరు అంశాల్లో స్పష్టతనిస్తూ ఈ జీవో ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలంటూ అక్టోబరు 18న సాధారణ పరిపాలనశాఖ జీవో నం.2323ను జారీ చేసింది.
2019 మార్చి 31వ తేదీ నాటికి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగించాలనే అంశం జీవో 2323లో ఉంది. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం నుంచి ఉద్యోగం కొనసాగింపునకు అనుమతి తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో జీవో నంబర్ 2323 రావడంతో కొత్త ప్రభుత్వం అనుమతి పొందిన రిటైర్డ్ ఉద్యోగులను ఉంచాలా? తొలగించాలా? అనే సందిగ్ధత ప్రభుత్వ శాఖల్లో ఏర్పడింది. దీనిపై స్పష్టత కోసం గురువారం జీవో ఇచ్చారు. మార్చి 31వ తేదీ తర్వాత, అక్టోబరు 18వ తేదీ కంటేముందుగానే రిటైర్డ్ ఉద్యోగులకు వారి సర్వీసులు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా సరే... వారందరినీ విధుల నుంచి తొలగించాలని తాజాగా ఇచ్చిన జీవోలో స్పష్టత ఇచ్చారు. వీరిని తొలగించేందుకు సంబంధిత శాఖ కార్యదర్శి లేదా విభాగాధిపతికి అధికారాలు ఉంటాయని జీవోలో పేర్కొన్నారు.
మరింత స్పష్టతనిస్తూ జీఏడీ మరో జీవో
పాత ప్రభుత్వం నియమించినా, కొత్త ప్రభుత్వం వచ్చాక ఉద్యోగం పొడిగింపునకు అనుమతి పొందినా సరే రిటైర్డ్ ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగించాల్సిందేనని మరింత స్పష్టతనిస్తూ గురువారం సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) పొటిలికల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వశాఖల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ప్రభుత్వ రిటైర్డ్ మధ్యస్థాయి అధికారుల తొలగింపు వ్యవహారంపై వేర్వేరు అంశాల్లో స్పష్టతనిస్తూ ఈ జీవో ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలంటూ అక్టోబరు 18న సాధారణ పరిపాలనశాఖ జీవో నం.2323ను జారీ చేసింది.
2019 మార్చి 31వ తేదీ నాటికి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగించాలనే అంశం జీవో 2323లో ఉంది. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం నుంచి ఉద్యోగం కొనసాగింపునకు అనుమతి తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో జీవో నంబర్ 2323 రావడంతో కొత్త ప్రభుత్వం అనుమతి పొందిన రిటైర్డ్ ఉద్యోగులను ఉంచాలా? తొలగించాలా? అనే సందిగ్ధత ప్రభుత్వ శాఖల్లో ఏర్పడింది. దీనిపై స్పష్టత కోసం గురువారం జీవో ఇచ్చారు. మార్చి 31వ తేదీ తర్వాత, అక్టోబరు 18వ తేదీ కంటేముందుగానే రిటైర్డ్ ఉద్యోగులకు వారి సర్వీసులు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా సరే... వారందరినీ విధుల నుంచి తొలగించాలని తాజాగా ఇచ్చిన జీవోలో స్పష్టత ఇచ్చారు. వీరిని తొలగించేందుకు సంబంధిత శాఖ కార్యదర్శి లేదా విభాగాధిపతికి అధికారాలు ఉంటాయని జీవోలో పేర్కొన్నారు.
0 Response to "All the retired employees are here! To further clarify, GAD is another G.O"
Post a Comment