Begin to implement the government mandate to teach English medium in public sector schools in the state ..
- రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరగాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలుకు కసరత్తు ప్రారంభం..
- 2020-21 నుంచి అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన..
- తెలుగు ఒక సబ్జెక్టు గా మాత్రమే ఉంటుంది..
- ఇక ఇంగ్లిష్ మీడియమే
- సర్కారీ బడుల్లో ఒక సబ్జెక్టుగా మాత్రమే తెలుగు -
రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరగాలన్న సర్కారు ఆదేశాల అమలుకు రంగం సిద్ధమవుతోంది . రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( ఎన్సీఈఆర్టీ ) ' ఈ మేరకు కసరత్తు ప్రారంభిం చింది . 2020 - 21లో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు , 2021 - 22 నుంచి తొమ్మిది , పది తరగతులకూ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఆంగ్ల మీడియంలో మాత్రమే బోధన జరిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది . విద్యాశాఖపై గత నెల 11న జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇకపై అన్ని తరగ తుల్లోనూ తెలుగు మాధ్యమం ఉండదు . తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది . పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ , జిల్లా మండల పరిషత్ , ఎయిడెడ్ , మున్సిపల్ . . తదితర అన్ని మేనేజ్ మెంట్లలో కలిపి 43 , 200 పాఠశాలలున్నాయి . వీటిల్లో ఇప్పటికే 1,500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతోంది . గతేడాది రాష్ట్రంలోని 1 వేల ప్రాథమిక పాఠశాల ( 1 - 5 తరగతులు ) ల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టారు .
రాష్ట్రంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడు తున్నందున దాదాపు 96 వేల మంది టీచర్లకు ఆంగ్ల బోధనలో శిక్షణ ఇప్పించాల్సిన అవ సరం ఉందని ఎస్సీఈఆర్ట్స్ అంచనా వేసింది . తెలుగు మీడియంలో చదువుకుని , ఇప్పటి వరకు తెలుగు మీడియంలోనే బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ అనివార్యంగా భావిస్తోన్న విద్యాశాఖ . . . ఆ మేరకు చర్యలు ప్రారంభించింది . దేశ వ్యాప్తంగా ఇంగ్లీషులో శిక్షణ ఇచ్చే సంస్థలను గుర్తించే పనిలో ఉంది . మైసూరులోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు ( ఆర్ఎఈ ) , హైదరాబాద్ లోని ఇఫ్లూ వంటి సంస్థల సహకారంతో ఉపాధ్యాయు లకు శిక్షణ ఇప్పించే దిశగా కసరత్తు చేస్తోంది . డిసెంబరు నుంచి ప్రారంభించి దశల వారీగా టీచర్లకు శిక్షణ ఇప్పించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం . ఇక పాఠ్యపుస్త కాల విషయానికి వస్తే . . . ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు ఉన్నాయి . అయితే వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నందున ఇబ్బంది ఉండబోదని అధికారులు అంటున్నారు . ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో తరగతిలో సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని , ఈ మేరకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయడంలో ఇబ్బంది లేదని చెబుతున్నారు .
0 Response to "Begin to implement the government mandate to teach English medium in public sector schools in the state .."
Post a Comment