Ideally the AP education system in the country
- దేశంలోనే ఆదర్శంగా ఏపీ విద్యావ్యవస్థ.
- విద్యను ఇష్టంగా అభ్యసించేలా పాఠ్యాంశాల మార్పు
- విద్యావ్యవస్థ కోసం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం
- విద్యాశాఖ మంత్రి డా . ఆదిమూలపు సురేష్
దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీ విద్యావ్యవస్థను రూపొందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి డా . ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు . రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థకార్యాలయంలో గురువారం అకడమిక్ అడ్వె జరీ బోర్డు సమావేశం జరిగింది . సమావేశంలో పాల్గొన్న మంత్రిసురేష్ మాట్లాడుతూ విద్యావ్యవస్థలో సంస్కరణలకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు . అందు లో భాగంగా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు అడ్వెజరీ బోర్డు సభ్యులతో చర్చించారు . ఆ విద్యార్థులకు నాణ్యమైన , నైపుణ్యంతో కూడిన విద్యను అందిం చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు . విద్యను ఇష్టంగా ఆస్వా దిస్తూ అభ్యసించాలంటే వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావా ల్సిన ఆవశ్యకత ఉందన్నారు . అందుకోసమే ప్రభుత్వం పాఠశాలల్లో వారానికోరోజును నో బ్యాగ్ డేగా అమలు చేస్తోందన్నారు .
నాడు నేడు , అమ్మఒడి , రాజన్న బడిబాట ఇలా ఎన్నో కార్యక్రమాలను విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతోందని మంత్రి సురేష్వివరించారు . పిల్లల వయస్సుకు తగినట్లుగా పుస్తకాల బరువులు ఉండేలా చూస్తామని , అందుకోసం పాఠ్యాంశాల్లో మార్పులు తేబో తున్నామని స్పష్టం చేశారు . పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రంలో మార్పులను ఇప్పటికే ప్రకటించామని , బిట్ పేపర్ను ప్రశ్నా పత్రంలో అంతర్భాగంగా చేస్తున్నామని వివరించారు . సిలబస్ మార్పుల కోసం బోర్డు సభ్యుల సూచనలను అడిగి తెలుసుకున్నారు . కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం , విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ , పాఠశాల విద్య రెగ్యులేటరీ , మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిన్ ఆర్ . కాంతారావు , ఎస్ఈఆర్టీ డైరెక్టర్ బి . ప్రతాప్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు .
0 Response to "Ideally the AP education system in the country"
Post a Comment