Textbooks will be changed from the 1st to 5th grades next academic year
పాఠ్య పుస్తకాలు మారతాయ్
1 నుంచి 5వ తరగతి వరకూ .
అకడమిక్ సలహా బోర్డు సమావేశంలో నిర్ణయం
వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు మారనున్నాయి . జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక - 2005 సిఫార్సులు , నూతన విద్యా విధానం - 2019 ప్రకారం ఈ మార్పులు చేయను న్నారు . 21 మంది నిపుణులతో కూడిన ' అకడమిక్ సలహా బోర్డు పుస్తకాల మార్పుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది . సబ్జెక్టులు , తరగతుల వారీగా ప్రస్తుత పాఠ్యాంశాలు , మార్పులు చేయాల్సిన విధానం పై సూచనలు , సిఫార్సులు చేసింది . పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో 3 రోజులపాటు నిర్వహించిన కార్య శాల ముగింపునకు మంత్రి సురేష్ హాజరయ్యారు . పాఠశాల విద్యలో తీసుకురా నున్న సంస్కరణల్లో భాగంగానే పాఠ్య పుస్తకాల్లో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు .
జిల్లా స్థాయిలో మరోసారి నిపుణులతో కార్యశాలలు నిర్వహించాలని నిర్ణయించారు . ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తారు . ఒకేసారి 1 - 5 తరగతులు కాకుండా ఒక సారి 1 , 3 , 5 , ఆ తర్వాత 2 , 4 తరగతుల పాఠ్య పుస్తకాలను మారిస్తే బాగుం టుందని జాతీయ విద్యా పరిశోధన , శిక్షణ మండలి ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు . మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టను న్నారు . దీనిపై అకడమిక్ సలహా బోర్డు సభ్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు . 1 నుంచి 3 తరగతుల వరకు తెలుగు మాధ్యమం కొనసాగించి , 4 . 5 తరగతులకు వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయాలని కొందరు సూచించారు . ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాధ్య మాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు . ఆంగ్లానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని మరికొందరు అభిప్రాయపడ్డారు .
1 నుంచి 5వ తరగతి వరకూ .
అకడమిక్ సలహా బోర్డు సమావేశంలో నిర్ణయం
వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు మారనున్నాయి . జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక - 2005 సిఫార్సులు , నూతన విద్యా విధానం - 2019 ప్రకారం ఈ మార్పులు చేయను న్నారు . 21 మంది నిపుణులతో కూడిన ' అకడమిక్ సలహా బోర్డు పుస్తకాల మార్పుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది . సబ్జెక్టులు , తరగతుల వారీగా ప్రస్తుత పాఠ్యాంశాలు , మార్పులు చేయాల్సిన విధానం పై సూచనలు , సిఫార్సులు చేసింది . పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో 3 రోజులపాటు నిర్వహించిన కార్య శాల ముగింపునకు మంత్రి సురేష్ హాజరయ్యారు . పాఠశాల విద్యలో తీసుకురా నున్న సంస్కరణల్లో భాగంగానే పాఠ్య పుస్తకాల్లో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు .
జిల్లా స్థాయిలో మరోసారి నిపుణులతో కార్యశాలలు నిర్వహించాలని నిర్ణయించారు . ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తారు . ఒకేసారి 1 - 5 తరగతులు కాకుండా ఒక సారి 1 , 3 , 5 , ఆ తర్వాత 2 , 4 తరగతుల పాఠ్య పుస్తకాలను మారిస్తే బాగుం టుందని జాతీయ విద్యా పరిశోధన , శిక్షణ మండలి ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు . మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టను న్నారు . దీనిపై అకడమిక్ సలహా బోర్డు సభ్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు . 1 నుంచి 3 తరగతుల వరకు తెలుగు మాధ్యమం కొనసాగించి , 4 . 5 తరగతులకు వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయాలని కొందరు సూచించారు . ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాధ్య మాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు . ఆంగ్లానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని మరికొందరు అభిప్రాయపడ్డారు .
0 Response to "Textbooks will be changed from the 1st to 5th grades next academic year"
Post a Comment